UP by-Elections: ముస్లిం సామ్రాజ్యంలో బీజేపీ ఘన విజయం.. యోగి ఏమన్నారంటే?
- యూపీ ఉపఎన్నికల్లో విజయం
- 9 స్థానాల్లో ఆరింటిని కైవసం చేసుకున్న కమల దళం
- కేవలం 2 సీట్లకే పరిమితమైన ఎస్పీ
- కుందర్కి సీటులో బీజేపీ అతిపెద్ద విజయం
- తీరిన బీజేపీ 31 ఏళ్ల రాజకీయ కరువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ ఉపఎన్నికల్లో విజయం సాధించడంపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని 9 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీజేపీ 6 సీట్లు గెలుచుకుంది. గబంధన్లో దాని మిత్రపక్షమైన ఆర్ఎల్డి మరో స్థానాన్ని గెలుచుకుంది. ఎస్పీ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. కుందర్కి సీటులో బీజేపీ అతిపెద్ద విజయం సాధించింది. ఈ విజయంతో బీజేపీ 31 ఏళ్ల రాజకీయ కరువుకు తెరపడింది. చివరిసారిగా 1993లో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది. ఈసారి బీజేపీ అభ్యర్థి రామ్వీర్ సింగ్ 1 లక్షా 31 వేల ఓట్ల ఆధిక్యం సాధించారు. ఎస్పీకి చెందిన హాజీ రిజ్వాన్కు 20 వేల ఓట్లు రావడంతో, మొరాదాబాద్ జిల్లాలో 60 శాతానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు అసెంబ్లీ సీటు గెలుపు, ఓటముల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
11 మంది ముస్లిం అభ్యర్థులలో ఒక్కడే హిందూ అభ్యర్థి..
కుందర్కి ఉప ఎన్నికలో 11 మంది ముస్లిం అభ్యర్థులలో బీజేపీ తరుఫున ఒక్కడే హిందూ అభ్యర్థిని నిలబెట్టింది. అదే సమయంలో, ఎస్పీ తన అభ్యర్థిగా సుమారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన హాజీ మహ్మద్ రిజ్వాన్కు బరిలోకి దింపింది. 2002లో కుందర్కి స్థానం నుంచి తొలిసారి ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2007లో బీఎస్పీకి చెందిన హాజీ అక్బర్ చేతిలో ఓడిపోయారు. కానీ 2012, 2017లో పునరాగమనం చేసి కుందర్కి సీటును వరుసగా రెండుసార్లు గెలుచుకున్నారు. ఈ సీటు SPకి కంచుకోటగా పరిగణిస్తారు. అయితే ఈసారి సమాజ్ వాదీ పార్టీ బలమైన కోటను BJP బద్దలు కొట్టింది. ఇది అఖిలేష్ యాదవ్కు పీడకల లాంటిదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read
ముఖ్యమంత్రి యోగి ఏమన్నారంటే?
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఈ విజయం సాధించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికే దక్కుతుందని, భద్రత, సుపరిపాలన, ప్రజా సంక్షేమ విధానాలతో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడం ఆయన మార్గనిర్దేశకమేనని అన్నారు. విభజిస్తే విడిపోతామని, ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి అన్నారు. కుందర్కిలో భారతీయ జనతా పార్టీ సాధించిన భారీ విజయం గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ‘కుందర్కిలో ఇది జాతీయవాదం యొక్క విజయం, ప్రతి వ్యక్తి తన మూలాలు గుర్తుంచుకుంటారు. అక్కడి ఓటర్లు తమ గోత్రాన్ని మళ్లీ గుర్తుచేసుకున్నారన్నారు. రాబోయే కాలంలో సమాజ్వాదీ పార్టీ పరిస్థతి ఏంటో కుందర్కి గెలుపు చెబుతోందన్నారు.
తాజావార్తలు
-
Astrology: జూలై 1 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!