Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ ఇటీవల రాజ్యాంగ సవరణ చేసింది. నవంబర్ 13న 27వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంతకం చేశారు. పాకిస్తాన్ ఎలాంటి చర్చ లేకుండా త్వరితగతిన ఈ సవరణలకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ దేశ సర్వసైన్యాధ్యక్షుడిగా మారడంతో పాటు సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించారు. ఈ సవరణలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తూ, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని…
United Nations: రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు సంస్థలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ఎఫెక్ట్, తాజాగా ఐక్యరాజ్యసమితి పైనా పడింది. పలు సంక్షోభ ప్రాంతాల్లో ఉన్న తమ శాంతి పరిరక్షకులను కుదించి తిరిగి వెనక్కి రప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Pakistan Vs India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు- సాయుధ సంఘర్షణ (CAAC)పై వార్షిక బహిరంగ చర్చ సందర్భంగా పాకిస్తాన్పై మరోసారి భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
India-Pakistan: ఎన్నిసార్లు భంగపడినా పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఈసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. దీనికి మన దౌత్యవేత్త భవిక మంగళానందన్ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.
ఇండోనేషియాలో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్గా భారత్కు చెందిన గీతా సబర్వాల్ను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ నియమించారు. సోమవారం తన పదవిని చేపట్టిన సభర్వాల్.. వాతావరణ పరివర్తన, స్థిరమైన శాంతి, పాలన, సామాజిక విధానానికి మద్దతు ఇచ్చే అభివృద్ధిలో 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు.
ఇజ్రాయెల్ ఆర్మీ తాజాగా మరోసారి గాజాపై కవ్వింపులకు పాల్పడింది. గాజా నుంచి తిరిగి వస్తున్న సహాయ కాన్వాయ్పై ఇజ్రాయెల్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ ఈ ఘటనను వెల్లడించింది. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని స్పష్టం చేసింది. కాగా గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ బాంబు దాడుల్లో ఇప్పటికే 20,000 మందికి పైగా పాలస్తీనా ప్రజలు మరణించగా.. వేల సంఖ్యలో గాయపడ్డారు. అయితే గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ…
Israel-Hamas War: మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాజా నుంచి హమాస్ మిలిటంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేయడంతో ఇరువర్గాల మధ్య యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ రోజు అత్యవసరంగా సమావేశం కాబోతోంది. మిడిల్ ఈస్ట్ పరిస్థితుల గురించి క్లోజ్డ్ డోర్ సెషన్ నిర్వహించబోతోందని యూఎన్ వెబ్సైట్ పేర్కొంది. ఇజ్రాయిల్పై హమాస్ దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయిల్ యుద్ధంలో ఉందని ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ అన్నారు.
అమెరికా సైనికుడు ఉత్తర కొరియా శరణుకోరినట్టు ఆ దేశం ప్రకటించింది. అమెరికా సైన్యంలో నెలకొన్న వివక్ష మూలంగా తన మనస్సు వికలంగా మారిందని.. అందుకే శరణు కోరుతున్నట్టు సైనికుడు చెప్పాడని.. ఉత్తర కొరియా ప్రకటించింది.
నేడు యోగా దినోత్సవాన్ని ఈ ప్రపంచమంతా జరుపుకుటుంది. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఏర్పాటు చేసిన యోగా సెలబ్రేషన్స్ లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా పలు దేశాల్లో సైతం యోగా దినోత్సవానికి ఆయా దేశాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.