Pakistan Vs India: ఐక్యరాజ్యసమితిలో మరోసారి పాక్పై భారత్ ఫైర్..
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు- సాయుధ సంఘర్షణపై చర్చ..
- యూఎన్ భద్రతా మండలిలో పాకిస్తాన్పై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్..
- రాజకీయ ప్రేరేపిత ప్రకటనల కోసం అంతర్జాతీయ వేదికలను పాక్ ఉపయోగించుకుంటోంది: భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Vs India: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు- సాయుధ సంఘర్షణ (CAAC)పై వార్షిక బహిరంగ చర్చ సందర్భంగా పాకిస్తాన్పై మరోసారి భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సొంత భూభాగంలో పిల్లలపై జరుగుతున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, దారుణాలను ఇస్లామాబాద్ చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ, రాజకీయ ప్రేరేపిత ప్రకటనల కోసం అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకుంటోందని UNలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ఆరోపించారు.
Read Also: Crime News: ఏడేళ్ల కొడుకుకు మందు తాగించిన తండ్రి.. చివరకు ఏమైందంటే?
Also Read
ఇక, CAAC ఎజెండాను వ్యతిరేకించిన వారిలో పాకిస్తాన్ ఒకటి అని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ పిలిచారు. భారతదేశంపై దుమ్మెత్తి పోసేందుకు ఐక్యరాజ్య సమితి చట్టాలను వక్రమార్గం పట్టడానికి ఇస్లామాబాద్ చేస్తున్న ప్రయత్నాలను తిరస్కరించారు. పాకిస్తాన్ దుర్మార్గపు నిర్ణయాలను కొనసాగించడానికి వివిధ చర్చలలో భారతదేశంపై విషం చిమ్ముతుందన్నారు. కాగా, సెక్రటరీ జనరల్ ఇటీవలి నివేదికలో నమోదు చేయబడినట్లుగా, పిల్లలపై జరిగిన దారుణాల రికార్డు నుంచి దృష్టి మరల్చడానికే పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుందన్నారు. అలాగే, పెరుగుతున్న సరిహద్దు ఉగ్రవాదం నుంచి దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ చేసిన ఈ ప్రయత్నాన్ని మేము తిరస్కరించామని పర్వతనేని హరీష్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!