India-Pakistan: వక్రబుద్ధి మార్చుకోని పాకిస్థాన్.. భారత్ స్ట్రాంట్ కౌంటర్
- ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్..
- కశ్మీర్.. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని లేవనెత్తిన పాక్ ప్రధాని షెహబాజ్..
- పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన భారత దౌత్యవేత్త భవిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pakistan: ఎన్నిసార్లు భంగపడినా పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఈసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. దీనికి మన దౌత్యవేత్త భవిక మంగళానందన్ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చింది. పాక్ ప్రధాని షెహబాజ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్ 370 రద్దుపై అసత్య ప్రచారం చేస్తుందని పేర్కొనింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి పాక్ మాట్లాడటమేంటో అని ప్రశ్నించింది.
Read Also: Bus Accident: ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ.. ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు
Also Read
ఈ ప్రపంచ వేదిక మీద అవాస్తవాలను వినాల్సి వస్తుందని భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ తెలిపారు. పాక్ సుదీర్ఘకాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. పొరుగు దేశాలపై దాడులకు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది అని ఆమె మండిపడింది. పాకిస్థాన్ మా భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్మూకశ్మీర్లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది అని ఆరోపించింది. మిలిటరీ సాయంతో నడుస్తూ.. ఉగ్రవాదం విషయంలో వరల్డ్ వైడ్ గా గుర్తింపుపొందిన పాక్.. భారత్ గురించి మాట్లాడే హక్కు లేదని భవిక హెచ్చరించింది.
ఇక, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో సాధారణ చర్చ సందర్భంగా పాక్ ప్రధాని షరీఫ్ జమ్మూకశ్మీర్ విషయాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో పాక్ లోని సమస్యలను వదిలేసిన షరీఫ్.. కేవలం కశ్మీర్ గురించే సుదీర్ఘంగా ప్రసంగించారు. పాలస్తీనా ప్రజల వలే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నట్లు అతడు కామెంట్స్ చేశారు. శాంతిస్థాపన కోసం 2019 ఆగస్టులో భారత్ ఏకపక్షంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!