India-Pakistan: వక్రబుద్ధి మార్చుకోని పాకిస్థాన్.. భారత్ స్ట్రాంట్ కౌంటర్
- ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై అక్కసు వెళ్లగక్కిన పాకిస్థాన్..
- కశ్మీర్.. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని లేవనెత్తిన పాక్ ప్రధాని షెహబాజ్..
- పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన భారత దౌత్యవేత్త భవిక..
India-Pakistan: ఎన్నిసార్లు భంగపడినా పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఈసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్పై పాకిస్థాన్ అక్కసు వెళ్లగక్కింది. దీనికి మన దౌత్యవేత్త భవిక మంగళానందన్ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చింది. పాక్ ప్రధాని షెహబాజ్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్ 370 రద్దుపై అసత్య ప్రచారం చేస్తుందని పేర్కొనింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి పాక్ మాట్లాడటమేంటో అని ప్రశ్నించింది.
Read Also: Bus Accident: ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ.. ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు
Also Read
- Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
- Tamil Nadu Politics: తమిళనాడులో రాజకీయ సంచలనం.. ‘విజయ్’ కింగ్ మేకర్గా మారతారా? మరో షాకింగ్ సర్వే!
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Bengal Elections: ఎన్నికల కౌంటింగ్ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..
ఈ ప్రపంచ వేదిక మీద అవాస్తవాలను వినాల్సి వస్తుందని భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ తెలిపారు. పాక్ సుదీర్ఘకాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. పొరుగు దేశాలపై దాడులకు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే దేశం.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది అని ఆమె మండిపడింది. పాకిస్థాన్ మా భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్మూకశ్మీర్లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది అని ఆరోపించింది. మిలిటరీ సాయంతో నడుస్తూ.. ఉగ్రవాదం విషయంలో వరల్డ్ వైడ్ గా గుర్తింపుపొందిన పాక్.. భారత్ గురించి మాట్లాడే హక్కు లేదని భవిక హెచ్చరించింది.
ఇక, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో సాధారణ చర్చ సందర్భంగా పాక్ ప్రధాని షరీఫ్ జమ్మూకశ్మీర్ విషయాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో పాక్ లోని సమస్యలను వదిలేసిన షరీఫ్.. కేవలం కశ్మీర్ గురించే సుదీర్ఘంగా ప్రసంగించారు. పాలస్తీనా ప్రజల వలే జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నట్లు అతడు కామెంట్స్ చేశారు. శాంతిస్థాపన కోసం 2019 ఆగస్టులో భారత్ ఏకపక్షంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని తెలిపారు.
తాజావార్తలు
-
AP WhatsApp Services: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వాట్సాప్లోనే మెడికల్ కౌన్సిల్ సేవలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్లలో రీపోలింగ్ ప్రారంభం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!