Shivraj Singh Chauhan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరద ముంపు కారణంగా బుడమేరు వాగు పొంగి కేసరపల్లి దగ్గర పంట పొలాలు ముంపుకు గురి కావడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు.
కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ కారు అతి వేగంగా నడిపి చిక్కుల్లో పడ్డారు. బీహార్లో టోల్ఫ్లాజా దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా కేంద్రమంత్రి కారు అతి వేగంగా వెళ్లినట్లు గుర్తించింది. దీంతో చిరాగ్ పాసవాన్ కారుకు ఈ-చలానా విధించబడింది. రెండు వేల రూపాయల వరకు చలానా విధించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
బీహార్లో కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్పై ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో తప్పించుకున్నారు. ఒక పబ్లిక్ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది. మంత్రి కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది. మైక్రోఫోన్ను లాక్కొని కేంద్రమంత్రిపై పిడిగుద్దులు కురిపించేందుకు ప్రయత్నించాడు.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసి హెచ్చరించారు. ఎన్హెచ్ఏఐ అధికారులు, కాంట్రాక్టర్ల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన తన లేఖలో ప్రశ్నలు సంధించారు.
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీపై కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీని కలవలేకే తన తండ్రి రామ్విలాస్ పాశ్వాన్ యూపీఏ నుంచి బయటకు వచ్చేశారని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bihar Bridge Collapse: బీహార్ రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా వరుసగా బ్రిడ్జ్లు కూప్పకూలిపోతున్నాయి. కేవలం 17 రోజుల వ్యవధిలోనే దాదాపు 12 వంతెనలు కూలిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ఇచ్చిన వివరణ నివ్వెరపరుస్తోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డా.. రాజ్యసభ సభా నాయకుడిగా నియమితులయ్యారు. జేపీ నడ్డాను రాజ్యసభలో సభాపక్ష నేతగా చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఇంతకుముందు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సభలో ఈ బాధ్యతను నిర్వహించేవారు.. అయితే అతను నార్త్ ముంబై లోక్సభ స్థానం నుండి ఎంపీగా ఎన్నికైన తరువాత, అతను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో.. ఈ బాధ్యతను జేపీ నడ్డాకు అప్పగించారు. ఈ నెల ప్రారంభంలో..…
కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక స్వామి వారి ఆశీర్వాద కోసం వచ్చానని..మొన్నటి ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గం 43 వేల మెజారిటీ వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఈ బాధ్యత కరీంనగర్ ప్రజలు పెట్టిన బిక్ష అని..సామాన్య కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి ఎదిగానంటే బీజేపీ కారణమని బండి సంజయ్ అన్నారు. 152 రోజులు కుటుంబానికి దూరమై ప్రజా సంగ్రామయాత్రతో తన వెంట ఉన్నారని గుర్తుచేశారు.
శనివారం బీహార్లో చివరి దశ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే.. పోలింగ్ రోజున కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ కాన్వాయ్ పై దుండగులు గత రాత్రి తుపాకీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కేంద్రమంత్రి పాట్లీపుత్ర పార్లమెంటరీ నియోజకవర్గంలోని మసౌర్హి ప్రాంతంలో ఉన్నారు.