Bandi Sanjay Kumar: కేంద్రంలోనూ వేముల వాడ రాజన్న ఆలయ విశిష్టతపై చర్చ
- స్వామి వారు ఎంత పవర్ ఫుల్లో కేసీఆర్ కి తెలుసు
- ఆలయ అభివృద్ధిని విస్మరించినందుకే ఈగతి
- ప్రస్తుత ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి సహకరిస్తుందని ఆశించిన సంజయ్
కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక స్వామి వారి ఆశీర్వాద కోసం వచ్చానని..మొన్నటి ఎన్నికలలో వేములవాడ నియోజకవర్గం 43 వేల మెజారిటీ వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక్కడి ప్రజలు ఆదరించారన్నారు. వారి రుణం తప్పక తీర్చుకుంటానని తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ స్వామి వారు ఎంత పవర్ ఫుల్ లో కేసీఆర్ కుటుంబానికి తెలుసన్నారు. ఏడాదికి రూ.400 కోట్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారని..ప్రసాద్ స్కీం కింద పెడదామన్న సహకరించలేదని చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధి పేరుతో కేసీఆర్ దేవుడికే శఠగోపం పెట్టారన్నారు. దేవుడిని మోసం చేస్తే తగిన శాస్తి జరుగుతుందనడానికి కేసీఆర్ సర్కారే నిదర్శనమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సహకరిస్తుందని ఆశిస్తున్నానన్నారు.
READ MORE: Raghunandan Rao: “బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ షిప్ లా తయారైంది”..బీఆర్ఎస్ పై రఘునందన్ ఫైర్
Also Read
రాజకీయాలకతీతంగా రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసుకొని భక్తులకు సౌకర్యాలు పెంచుకోవలసిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉంటుందని.. నేను బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఎన్నికల ముందు రాజన్నను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దర్శించుకున్నందున కేంద్రంలోనూ రాజన్న ఆలయ విశిష్టత పై చర్చ జరిగిందని పేర్కొన్నారు. నాకు ఇచ్చిన మెజార్టీ ప్రజల ఆకాంక్షను అనుగుణంగా పనిచేసే అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. దేవాలయ అభివృద్ధి చేయాలనే హామీకి కట్టుపడి పనిచేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తానని.. ఆలయ విస్తరణ విషయంలో కమిట్ మెంట్ తో పనిచేస్తానని వెల్లడించారు. అభివృద్ధి చేసి తానేంటో చూపిస్తానన్నారు.
తాజావార్తలు
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
-
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
-
Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో