Nitin Gadkari: పంజాబ్లో శాంతిభద్రతలు సరిగ్గా లేవు.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన గడ్కరీ
- కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పంజాబ్ ప్రభుత్వానికి లేఖ
- అధికారులు...కాంట్రాక్టర్ల భద్రతపై ఆందోళన
- ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నలు
- కోట్ల విలువైన 293కిలోమీటర్ల ప్రాజెక్టులు ఆగిపోతాయని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసి హెచ్చరించారు. ఎన్హెచ్ఏఐ అధికారులు, కాంట్రాక్టర్ల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన తన లేఖలో ప్రశ్నలు సంధించారు. ఇలాగే కొనసాగితే రూ.14,288 కోట్ల విలువైన 293కిలోమీటర్ల ప్రాజెక్టులు ఆగిపోతాయన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు రాసిన లేఖ ప్రకారం..
READ MORE: Ram Charan: వావ్.. గేమ్ ఛేంజర్ లో మూడు పాత్రల్లో కనిపించనున్న రామ్ చరణ్
Also Read
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
“ఢిల్లీ-కత్రా ఎక్స్ప్రెస్వే ప్రాజెక్ట్పై జరిగిన రెండు సంఘటనల గురించి నాకు ఇటీవల తెలిసింది. జలంధర్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఇంజనీర్పై దారుణంగా దాడి జరిగింది. నేను మీకు వారి ఫోటో పంపుతున్నాను. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు లూథియానా జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఢిల్లీ-కత్రా ఎక్స్ప్రెస్వేపై ఓ కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ క్యాంపుపై దుండగులు దాడి చేశారు. ప్రాజెక్ట్ క్యాంపులో ఉన్న ఇంజనీర్లు, ఉద్యోగులను సజీవ దహనం చేయడానికి ఈ వ్యక్తులు ప్రయత్నించారు. ఈ విషయమై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నేరగాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎన్హెచ్ఏఐ అధికారుల నమ్మకాన్ని నిలబెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.” అని పేర్కొన్నారు.
READ MORE:Muppavarapu Venkaiah Naidu: నేతలపై వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా అయితేనే రాజకీయాల్లోకి రండి
జులై 15న పంజాబ్లోని పీడబ్య్లూడీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పంజాబ్ ప్రాజెక్టుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించినట్లు కూడా కేంద్ర మంత్రి తన లేఖలో తెలిపారు. ఈ సమావేశంలో భూసేకరణ, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదని పర్కొన్నారు. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారిందని… పంజాబ్లో గతంలో 103 కిలోమీటర్ల మేర రూ.3263 కోట్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని హెచ్చరించారు. ఇది ఇలాగే కొనసాగితే రూ.14288 కోట్ల విలువైన 293కిమీ ప్రాజెక్టులు నిలిచిపోతాయని లేఖలో వెల్లడించారు.
తాజావార్తలు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!