Chirag Paswan: కేంద్రమంత్రి కారుకి రూ.2 వేల చలానా.. అతి వేగమే కారణం!
- కేంద్రమంత్రి కారు చిరాగ్ పాసవాన్కి 2 వేల చలానా
- అతి వేగమే కారణం!.. చర్చనీయాంశంగా వ్యవహరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాసవాన్ కారు అతి వేగంగా నడిపి చిక్కుల్లో పడ్డారు. బీహార్లో టోల్ఫ్లాజా దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టమ్ ద్వారా కేంద్రమంత్రి కారు అతి వేగంగా వెళ్లినట్లు గుర్తించింది. దీంతో చిరాగ్ పాసవాన్ కారుకు ఈ-చలానా విధించబడింది. రెండు వేల రూపాయల వరకు చలానా విధించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Rhea Chakraborty: నేను జైలులో ఉన్నప్పుడు.. నా తల్లిదండ్రులు ఫ్రెండ్స్ తో కలిసి మందేశారు!
Also Read
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
- Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
- Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
- Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు 'ప్రతీక్ యాదవ్' మృతి..!
చిరాగ్ పాసవాన్ వాహనంలో బీహార్లోని హాజీపుర్ నుంచి చంపారన్కు వెళుతున్నారు. అతి ఆయన కారు.. అతి వేగంగా వెళ్లడంతో ఈ- చలానా జారీ అయినట్లు కథనాలు వెలువడ్డాయి. జాతీయ రహదారిపై పరిమితికి మించిన వేగంతో వెళుతుండగా.. దాన్ని గుర్తించిన ఈ- డిటెక్షన్ సిస్టమ్ ఆయన వాహనానికి ఆటోమేటిక్ చలానాను జారీ చేసినట్లు తెలుస్తోంది. అతివేగమే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పోలీసు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే ఈ చలానాతో కేంద్రమంత్రికి సంబంధం లేదంటూ చిరాగ్ సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Paralympics 2024: భారత్కు మరో బంగారు పతకం.. బ్యాడ్మింటన్లో స్వర్ణం సాధించిన నితీష్ కుమార్
అతివేగంగా వెళ్లడం, డాక్యుమెంట్ లోపాలను సులువుగా ఈ- డిటెక్షన్ గుర్తిస్తుంది. ఈ సిస్టమ్ను బీహార్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల అమలు చేస్తోంది. ఆటోమేటిక్ చలానాల జారీ కోసం అన్ని టోల్ ప్లాజాల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించేందుకు ఈ సిస్టమ్ను ఆగస్టు నుంచి అమలు చేస్తోంది. ఇప్పటి వరకు రూ.9.49 కోట్ల జరిమానాలను జారీ అయ్యాయి. వాహనాల ఫిట్నెస్, కాలుష్య, డాక్యుమెంట్ లోపాలు, అతివేగంగా వెళ్లినప్పుడు చలానా జారీ అవుతుంది. జరిమానా నేరుగా కారు యాజమాని మొబైల్ నెంబర్కు వెళ్తుంది. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి ఈ-చలానా రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..
తాజావార్తలు
-
Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
-
IPL 2026 Tickets Scam: ఫ్రీ ఐపీఎల్ టికెట్లు అంటూ భారీ మోసం.. 600కు పైగా ఫేక్ వెబ్సైట్లు గుర్తింపు, తస్మాత్ జాగ్రత్త!
-
CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
-
US – Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు, ఒక్క రోజులోనే తొలగింపు.. విమర్శలకు తలొగ్గిన సీఎం విజయ్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!