అక్కినేని నాగచైతన్య హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై టాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ గ్లింప్స్ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ను అత్యంత గ్రాండ్గా నిర్వహించేందుకు మేకర్స్ ఒక ఆసక్తికరమైన వేదికను ఎంచుకున్నారు.
Also Read : Kanchana 4: హోలీ కానుకగా.. ‘కాంచన’ మూవీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్..
ఈ నెల మార్చి 5న విడుదల కానున్న ‘వృషకర్మ’ గ్లింప్స్ను తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదైన హైదరాబాద్లోని ప్రసాద్స్ పి సి ఎక్స్ (Prasads PCX) స్క్రీన్పై ప్రదర్శించనున్నారు. మార్చి 5వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. కేవలం మీడియా ప్రతినిధులు మాత్రమే కాకుండా, పెద్ద సంఖ్యలో అక్కినేని అభిమానులు కూడా ఈ ఈవెంట్కు హాజరుకానున్నారు. భారీ స్కేల్తో, హై టెక్నికల్ వాల్యూస్తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ గ్లింప్స్ చైతు కెరీర్లోనే ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.