ఏపీలో బావికొండ బుద్ధిష్ట్ స్థావరాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… టూరిజానికి సంబంధించి ప్రత్యేక పాలసీ లేదు. త్వరలోనే సమగ్రమైన పాలసీని తీసుకువస్తాo. దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ టూరిజం కి మంచి అవకాశాలున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం త్వరలోనే అన్నవరం, ప్రసాదం స్కీం కింద నిధులు మంజూరు చేస్తున్నం. మహాయాన బుద్ధిష్ట్ సర్క్యూట్ ని అభివృద్ధి…
3 రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఏపీలో మూడు రాజధానులు చేస్తామంటూ జగన్ సర్కార్ ప్రకటించడంతో పాటు అసెంబ్లీలో చట్టం చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుపున హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటునట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ పరిణామాల్లో మార్పు చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి..…
ఎయిమ్స్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో మారు తప్పుడు ప్రచారం అని రాష్ట్ర మంత్రి హరీష్ రావు అన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాస్తవాలు వక్రీకరించి మాట్లాడుతున్నారు. మొన్ననేమో ఎయిమ్స్ కి భూమి ఇవ్వలేదని ఆరోపణ చేశారు. సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్ చూపించాం. ఇప్పుడేమో బిల్డంగ్ డాక్యుమెంట్స్, ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ అంటున్నారు. రోజుకో తీరుగా మాట్లాడుతున్నారు. ఎయిమ్స్ విషయంలో ఈ ఏడాది అక్టోబర్9 న రాష్ట్ర ప్రభుత్వ…
తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు…
హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం ఆగిపోతుందనుకుంటే.. వాటి తీవ్రత మరింత పెరిగింది.. సీఎం కేసీఆర్ ఎంట్రీతో హీట్ మరింత పెరిగింది.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కేంద్ర ప్రభుత్వం, మంత్రులు, ప్రధాని నరేంద్ర మోడీ ఇలా.. అన్ని విషయాలను తూర్పారబడుతున్నారు సీఎం కేసీఆర్.. అయితే, బీజేపీ నేతలు కూడా అదేస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇక, ఇవాళ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర…
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి శనివారం జూబ్లీహిల్స్లో ఓ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఫిల్మింనగర్లో ఏర్పాటు చేసిన దక్కన్ కిచెన్ ఫైన్ రెస్టారెంట్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రజలెవరూ గత సంవత్సరకాలంగా బయటకు రావడంలేదని.. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలు మెచ్చే అభిరుచులతో దక్కన్ కిచెన్ ఫైన్…
కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వరంగల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాను పర్యాటక కేంద్రంగా మారుస్తామని హామి ఇచ్చారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు టూర్ ఆపరేటర్స్కు రూ.10లక్షల రుణాలు బ్యాంకుల ద్వారా అందింస్తామని తెలిపారు. మేడారం జాతరను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పిన కిషన్రెడ్డి, మేడారం జాతర గురించి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా ప్రచారం చేస్తామన్నారు. అంతేకాకుండా తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని, అభివృద్ధి…
అతి ప్రాచీన కట్టడం అయిన రుద్రేశ్వర దేవాలయము అభివృద్ధికి పాటుపడతానన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయాయన్నారు. కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యత తీసుకున్న తరువాత.. విద్యావతి తన దగ్గరకు వచ్చి మొదటి విషయం చెప్పిన అంశం రామప్ప దేవాలయం గురించే అన్నారు. చాలా దేశాలు రామప్ప దేవాలయం ను వ్యతిరేకించాయని, అయితే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ దేశాలు అయితే రామప్ప గుర్తింపు కు అడ్డుకున్నాయో వాటి…
తిరుమల : టిటిడి పాలకమండలి ప్రత్యేక ఆహ్వనితుల నియామకంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాజా గా సీఎం జగన్ కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తన సిఫార్సు తో రవిప్రసాద్ అనే వ్యక్తికి పాలకమండలి ప్రత్యేక ఆహ్వనితుడిగా నియామకం జరిగినట్లు ప్రచారం జరుగుతుందని విస్మయం వ్యక్తం చేసిందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను కాని…తన మంత్రిత్వ శాఖ ద్వారా కాని ఎవరికి సిఫార్సు చేయలేదని లేఖలో కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశం…
నేడు క్రీడా దినోత్సవం సందర్బంగా తెలంగాణ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓయూలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరైయ్యారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మరో ఇరువై ఏళ్ళు అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని కామెంట్స్ చేశారు. తెలంగాణ అభివృద్ధికి మేమంతా కట్టుబడి ఉన్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. అలాగే…