కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అదేనా.. అందుకే ఇలా చేస్తున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు మాటలు నమ్మాలో.. లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల వ్యాఖ్యలు నమ్మాలో రైతులు పాలుపోవడం లేదు.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేతలేమో టీఆర్ఎస్, బీజేపీలు కావాలనే రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మొన్నామధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్ష పార్టీ స్థానంలో ఉన్న కాంగ్రెస్ను వెనక్కినెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఇటీవల జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపుతో తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఖాయం అన్నట్లు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. అయితే ఇలాగే కొనసాగితే.. బీజేపీ తెలంగాణలో పుంజుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా.. అని ఆలోచన కేసీఆర్ మదిలో మెదిలిందా..? అందుకే బీజేపీ ని టార్గెట్ చేశారా..? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
వాస్తవానికి చూస్తుంటే అలాగే కనిపిస్తుంది… కేసీఆర్తో పాటు యావత్తు టీఆర్ఎస్ నాయకులపైన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దుమ్మెత్తి పోస్తున్నా.. కేసీఆర్ ఆ వంక కన్నెత్తి చూడడం లేదు.ఎందుకంటే హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాకపోవడం. దీంతో కాంగ్రెస్ ఈ మధ్యకాలంలో తెలంగాణలో బలపడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయనే భావనేనని కొందరు అంటున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో బీజేపీ నేతలు ఏం మాట్లాడినా.. అందులో ఒక అవకాశం దొరికితే దాన్ని ఆయుధంగా చేసుకొని టీఆర్ఎస్ అధినేతతో సహా టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు.
వీలైనంత వరకు బీజేపీపై ప్రజల్లో ఓ విముఖత తీసుకురావాలనే భావన ఖచ్చితంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రైతన్నలకు అండగా టీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేపట్టేందుకు నడుం బిగించింది. ధాన్యం కొనుగోలును ఆసరాగా చేసుకొని మరోసారి ప్రజల్లో టీఆర్ఎస్పై నెలకొన్న విముఖతను తరిమికొట్టేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది ప్రతిపక్షాల వాదన. అందుకే కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేసి… ఈ విధంగా టీఆర్ఎస్ నేతలను రంగంలోకి దింపుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీపై పోరాటానికి ధాన్యం కొనుగోలుకి మించిన ఆయుధం లేదని కేసీఆర్ భావిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
- Tags
- bandi sanjay
- cm kcr
- congress
- kcr
- ktr
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!