Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kcr Master Plan Is To Target The Bjp

కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ అదేనా.. అందుకే ఇలా చేస్తున్నారా..?

Published Date :November 11, 2021 , 6:11 pm
By Gogikar Sai Krishna
కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ అదేనా.. అందుకే ఇలా చేస్తున్నారా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్‌ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలు మాటలు నమ్మాలో.. లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల వ్యాఖ్యలు నమ్మాలో రైతులు పాలుపోవడం లేదు.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ నేతలేమో టీఆర్‌ఎస్‌, బీజేపీలు కావాలనే రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. మొన్నామధ్య జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రతిపక్ష పార్టీ స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ఇటీవల జరిగిన హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపుతో తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఖాయం అన్నట్లు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. అయితే ఇలాగే కొనసాగితే.. బీజేపీ తెలంగాణలో పుంజుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా.. అని ఆలోచన కేసీఆర్‌ మదిలో మెదిలిందా..? అందుకే బీజేపీ ని టార్గెట్‌ చేశారా..? అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Also Read

  • Hormuz: హార్ముజ్ దగ్గర ఉద్రిక్తత.. నౌకపై ఇరాన్ దాడులు
  • Delhi: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య.. లైంగిక దాడి అనంతరం మొబైల్ ఛార్జర్‌తో గొంతు నులిమి
  • Karnataka: దారుణం.. హోమ్‌స్టేలో అమెరికా మహిళపై అత్యాచారం.. 3 రోజులు వైఫై నిలిపివేత
  • Kharge vs BJP: మోడీ టెర్రరిస్ట్.. ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

వాస్తవానికి చూస్తుంటే అలాగే కనిపిస్తుంది… కేసీఆర్‌తో పాటు యావత్తు టీఆర్‌ఎస్‌ నాయకులపైన కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి దుమ్మెత్తి పోస్తున్నా.. కేసీఆర్‌ ఆ వంక కన్నెత్తి చూడడం లేదు.ఎందుకంటే హుజురాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం డిపాజిట్‌ కూడా రాకపోవడం. దీంతో కాంగ్రెస్‌ ఈ మధ్యకాలంలో తెలంగాణలో బలపడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయనే భావనేనని కొందరు అంటున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో బీజేపీ నేతలు ఏం మాట్లాడినా.. అందులో ఒక అవకాశం దొరికితే దాన్ని ఆయుధంగా చేసుకొని టీఆర్‌ఎస్‌ అధినేతతో సహా టీఆర్‌ఎస్‌ నాయకులు బీజేపీ నేతలను టార్గెట్‌ చేస్తున్నారు.

వీలైనంత వరకు బీజేపీపై ప్రజల్లో ఓ విముఖత తీసుకురావాలనే భావన ఖచ్చితంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ రైతన్నలకు అండగా టీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నాలు చేపట్టేందుకు నడుం బిగించింది. ధాన్యం కొనుగోలును ఆసరాగా చేసుకొని మరోసారి ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై నెలకొన్న విముఖతను తరిమికొట్టేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది ప్రతిపక్షాల వాదన. అందుకే కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేసి… ఈ విధంగా టీఆర్‌ఎస్‌ నేతలను రంగంలోకి దింపుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. బీజేపీపై పోరాటానికి ధాన్యం కొనుగోలుకి మించిన ఆయుధం లేదని కేసీఆర్ భావిస్తున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • cm kcr
  • congress
  • kcr
  • ktr

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..

  • Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..

  • LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?

  • Bank Fraud: SBI బ్యాంక్‌లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్‌తో పాటు..

  • Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్‌కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions