ఏపీలో బావికొండ బుద్ధిష్ట్ స్థావరాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… టూరిజానికి సంబంధించి ప్రత్యేక పాలసీ లేదు. త్వరలోనే సమగ్రమైన పాలసీని తీసుకువస్తాo. దీన్ని ఒక పరిశ్రమగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్ టూరిజం కి మంచి అవకాశాలున్నాయి. ఇప్పటికే శ్రీశైలం, సింహాచలం త్వరలోనే అన్నవరం, ప్రసాదం స్కీం కింద నిధులు మంజూరు చేస్తున్నం. మహాయాన బుద్ధిష్ట్ సర్క్యూట్ ని అభివృద్ధి చేస్తాం. అలాగే కాకినాడ, నెల్లూరులో, బీచ్ కోస్టల్ కారిడార్ అభివృద్ధి చేస్తాం అని తెలిపారు.
ఇక కేంద్ర పర్యాటక శాఖ నుండి రాష్ట్రానికి సుమారుగా 234 కోట్ల రూపాయలు కేటాయించాఓ అని చెప్పిన కిషన్ రెడ్డి ఏపీ పర్యాటక రంగం గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 27 కోట్ల రూపాయలుతో అమరావతి లో బౌద్ధ క్షేత్రం లో అభివృద్ధి చేస్తున్నాం. విశాఖలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అన్నారు. అలాగే టూర్ ఆపరేటర్లకు 10 లక్ష రూపాయల ‘, గైడ్ లకు లక్ష రూపాయలు లోన్ మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. 18 కోట్ల తో అల్లూరి సీతారామరాజు మ్యూజియం నిర్మాణం చేయబోతున్నాం. అమరావతి రాజధాని విషయంలో సోము వీర్రాజు ప్రకటించడం నిర్ణయమే మా నిర్ణయం. విశాఖ టూరిజం అభివృద్ధిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.