Tirumala: సామాన్య భక్తులకే పెద్దపీట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమలలో ఇకనుంచి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సామాన్య భక్తులుకు దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శుక్ర,శని,ఆదివారాలలో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని ఆయన తెలిపారు. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం అన్నారు.
భక్తులు సౌకర్యార్ధం యాత్రికులు వసతి సముదాయంలో అన్నప్రసాద వితరణ పున:ప్రారంభించాం. ఏప్రిల్ 24వ తేది నుంచి వయోవృద్దులు,వికలాంగులుకు ప్రత్యేక దర్శనాలు ప్రారంభించాం అని ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేది వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం అన్నారు ఈవో ధర్మారెడ్డి. 2500 మంది శ్రీవారి సేవకులు ప్రతి నిత్యం భక్తులకు సేవలందిస్తున్నారు.
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
జమ్ము,సీతంపేట,అమరావతిలో శ్రీవారి ఆలయాల నిర్మాణం జరుగుతుందన్నారు. ముంబాయిలో 70 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాం అన్నారు. మే 21వ తేదీన భువనేశ్వర్ లోని శ్రీవారి ఆలయాన్ని ప్రారంభిస్తామని ధర్మారెడ్డి వెల్లడించారు. 18 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపాన్ని నిర్మిస్తున్నామన్నారు. మే 15 నుంచి 17వ తేదీ వరకు తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా వుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనార్థం వేచి వున్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,087 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,271 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు అని టీటీడీ తెలిపింది.కరోనా ప్రభావం తగ్గడం వల్ల తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.
ఢిల్లీలో బ్రహ్మోత్సవాలు
ఇదిలా వుంటే దేశ రాజధాని ఢిల్లీలోని గోలే మార్కెట్ లోని టీటీడీ బాలాజీ మందిర్ లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మే 12న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. మే 17న కళ్యాణోత్సవం, మే 22న పుష్పయాగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 12 తేదీ నుంచి 22 తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. భక్తులు ఉచితంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. తిరుపతి నుంచి వచ్చిన 30 మంది అర్చకుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు కడు వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఉన్న ప్రముఖులు బ్రహ్మోత్సవాలకు వస్తున్నారు. ఢిల్లీ టీటీడీ స్థానిక సలహా కమిటీ సభ్యుల సొంత నిధులతోనే ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!