Tirumala: సామాన్య భక్తులకే పెద్దపీట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమలలో ఇకనుంచి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సామాన్య భక్తులుకు దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శుక్ర,శని,ఆదివారాలలో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని ఆయన తెలిపారు. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం అన్నారు.
భక్తులు సౌకర్యార్ధం యాత్రికులు వసతి సముదాయంలో అన్నప్రసాద వితరణ పున:ప్రారంభించాం. ఏప్రిల్ 24వ తేది నుంచి వయోవృద్దులు,వికలాంగులుకు ప్రత్యేక దర్శనాలు ప్రారంభించాం అని ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేది వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం అన్నారు ఈవో ధర్మారెడ్డి. 2500 మంది శ్రీవారి సేవకులు ప్రతి నిత్యం భక్తులకు సేవలందిస్తున్నారు.
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
జమ్ము,సీతంపేట,అమరావతిలో శ్రీవారి ఆలయాల నిర్మాణం జరుగుతుందన్నారు. ముంబాయిలో 70 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాం అన్నారు. మే 21వ తేదీన భువనేశ్వర్ లోని శ్రీవారి ఆలయాన్ని ప్రారంభిస్తామని ధర్మారెడ్డి వెల్లడించారు. 18 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపాన్ని నిర్మిస్తున్నామన్నారు. మే 15 నుంచి 17వ తేదీ వరకు తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయంలో వసంతోత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా వుంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనార్థం వేచి వున్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 61,087 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,271 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు అని టీటీడీ తెలిపింది.కరోనా ప్రభావం తగ్గడం వల్ల తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.
ఢిల్లీలో బ్రహ్మోత్సవాలు
ఇదిలా వుంటే దేశ రాజధాని ఢిల్లీలోని గోలే మార్కెట్ లోని టీటీడీ బాలాజీ మందిర్ లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మే 12న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. మే 17న కళ్యాణోత్సవం, మే 22న పుష్పయాగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మే 12 తేదీ నుంచి 22 తేదీ వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. భక్తులు ఉచితంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. తిరుపతి నుంచి వచ్చిన 30 మంది అర్చకుల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు కడు వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో ఉన్న ప్రముఖులు బ్రహ్మోత్సవాలకు వస్తున్నారు. ఢిల్లీ టీటీడీ స్థానిక సలహా కమిటీ సభ్యుల సొంత నిధులతోనే ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
-
Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్కు పెను ప్రమాదం..
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
-
Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..