Tirumala: భక్తులతో కళకళ… శ్రీవారి హుండీ గలగల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలియుగ వైకుంఠం తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. తిరుమల శ్రీవారి హుండి గలగలలాడుతోంది. కోవిడ్ కారణంగా ఏడాదిగా తగ్గిన స్వామి వారి ఆదాయం… అంచనాలకు మించి పెరుగుతోంది. ఈ మాసంలో ఇప్పటికే 90 కోట్లు దాటగా… నెలాఖరుకు వందకోట్లు అవుతుందని ఆంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి పుణ్యమాని 2020లో హుండీ ఆదాయం రూ.700 కోట్లే. కానీ 2021లో హుండీ ఆదాయం రూ.900 కోట్లకు పెరగడంతో టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రూ.128 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్లో ఇప్పటివరకూ 100 కోట్లకు పైగానే హుండీ ఆదాయం లభించింది.
అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడైన శ్రీవారి దర్శనార్దం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంటే స్వామి హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది. కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఏడు కొండలకు భక్తులు పోటెత్తుతున్నారు. 2020 వరకు పెరుగుతూ వచ్చిన ఆదాయం… ఆ తర్వాత కరోనా కారణంగా తగ్గిపోయింది. 80 రోజులు పాటు దర్శనాలు నిలివేశాక… తర్వాత కూడా పరిమితంగానే భక్తుల్ని అనుమతించారు. దీనివల్ల 2020 సంవత్సరానికి 13 వందల కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుందని అనుకుంటే…, ఏడువందల కోట్ల వరకు తగ్గిపోయింది. 2021లో కూడా 900 కోట్లు మాత్రమే వచ్చింది.
Also Read
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
కోవిడ్ తీవ్రత తగ్గడంతో శ్రీవారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. సాధారణంగా ఒక రోజుకు శ్రీవారికి 3 కోట్లు వరకు హుండీ ఆదాయం వస్తుంది. గత మార్చిలో 128 కోట్ల రూపాయల కానుకలు వచ్చాయి. ఇక ఏప్రిల్ మాసంలో కూడా 21 రోజులకు 90 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల చివరి నాటికి 120 కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి గతంలో మాదిరిగా శ్రీవారి పై కాసుల వర్షం కురుస్తుండడంపై టీటీడీ సంతోషం వ్యక్తం చేస్తోంది.
తిరుమలకు గతంతో పోలిస్గే భక్తుల రద్దీ తగ్గింది. 3 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు 67,437 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన వారు 29,440 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.4.28 కోట్లుగా టీటీడీ పేర్కొంది. సరాసరిన ఈ మధ్యకాలంలో 4 కోట్లకు పైనే ప్రతిరోజూ ఆదాయం లభిస్తోంది.
Read Also: Vemulawada Temple: నిండిన హుండీ.. పట్టించుకునేవారేరి?
తాజావార్తలు
-
Punjab Politics: పంజాబ్లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
-
YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
-
Priyanka Gandhi: ఆయన సర్టిఫికెట్ మాకు అవసరం లేదు.. మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ కౌంటర్
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!