Gangamma Jatara: కనుల పండువగా గంగమ్మ జాతర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Also Read
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
ఈ జాతర బుధవారం బుధవారం నుంచి ప్రారంభం కాగా.. తొమ్మిది రోజుల పాటు ఈ జాతర నిర్వహించనున్నారు. రోజుకో వేషంలో భక్తులు కనిపిస్తారు. ఏటా చైత్రమాసం చివరిరోజు ఈ జాతర నిర్వహిస్తారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తొలి సారెను సమర్పించారు. భూమన కుటుంబ సభ్యులకు ముస్లిం సోదరులు స్వాగతం పలికారు. గతరెండేళ్లుగా జాతర ఏకాంతంగానే నిర్వహించారు.
కరోనా వల్ల జాతర సందడి లేకుండా పోయిందని.. ఈ ఏడాది అంతా బాగుందని, అమ్మవారి జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా వుందంటున్నారు తిరుపతి వాసులు. జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొమ్మిది వందల సంవత్సరాలుగా గంగమ్మ జాతర జరుగుతోందని తిరుపతి వాసులు చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి కి చెల్లెలుగా అమ్మవారికి స్వామి సారె అందుతుంది. జాతర ప్రారంభం నాడే వర్షం పడింది. ఇది ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుందనడానికి సంకేతం అంటున్నారు.
జాతర సదర్భంగా టీటీడీ అధికారులు సారెను అందిస్తారు. జాతర నాలుగోరోజున టీటీడీ అర్చకులు, ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పుట్టింటి సారె అందజేస్తారు. పూర్వం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి ముందుగా గంగమ్మ తల్లిని దర్శించుకునేవారు. అలా చేస్తే తిరుపతి యాత్ర సంపూర్ణం అవుతుందని, చెల్లెలిని కొలిచే వచ్చేవారిని శ్రీవారు కరుణిస్తారని నమ్మకం. తాతయ్య గుంట గంగమ్మకు సారె ను సమర్పించనున్నారు మంత్రులు రోజా, నారాయణ స్వామి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!