Gangamma Jatara: కనుల పండువగా గంగమ్మ జాతర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Also Read
- AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
ఈ జాతర బుధవారం బుధవారం నుంచి ప్రారంభం కాగా.. తొమ్మిది రోజుల పాటు ఈ జాతర నిర్వహించనున్నారు. రోజుకో వేషంలో భక్తులు కనిపిస్తారు. ఏటా చైత్రమాసం చివరిరోజు ఈ జాతర నిర్వహిస్తారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తొలి సారెను సమర్పించారు. భూమన కుటుంబ సభ్యులకు ముస్లిం సోదరులు స్వాగతం పలికారు. గతరెండేళ్లుగా జాతర ఏకాంతంగానే నిర్వహించారు.
కరోనా వల్ల జాతర సందడి లేకుండా పోయిందని.. ఈ ఏడాది అంతా బాగుందని, అమ్మవారి జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా వుందంటున్నారు తిరుపతి వాసులు. జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొమ్మిది వందల సంవత్సరాలుగా గంగమ్మ జాతర జరుగుతోందని తిరుపతి వాసులు చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి కి చెల్లెలుగా అమ్మవారికి స్వామి సారె అందుతుంది. జాతర ప్రారంభం నాడే వర్షం పడింది. ఇది ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుందనడానికి సంకేతం అంటున్నారు.
జాతర సదర్భంగా టీటీడీ అధికారులు సారెను అందిస్తారు. జాతర నాలుగోరోజున టీటీడీ అర్చకులు, ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పుట్టింటి సారె అందజేస్తారు. పూర్వం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి ముందుగా గంగమ్మ తల్లిని దర్శించుకునేవారు. అలా చేస్తే తిరుపతి యాత్ర సంపూర్ణం అవుతుందని, చెల్లెలిని కొలిచే వచ్చేవారిని శ్రీవారు కరుణిస్తారని నమ్మకం. తాతయ్య గుంట గంగమ్మకు సారె ను సమర్పించనున్నారు మంత్రులు రోజా, నారాయణ స్వామి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి.
తాజావార్తలు
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!