Gangamma Jatara: కనుల పండువగా గంగమ్మ జాతర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
Also Read
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ఈ జాతర బుధవారం బుధవారం నుంచి ప్రారంభం కాగా.. తొమ్మిది రోజుల పాటు ఈ జాతర నిర్వహించనున్నారు. రోజుకో వేషంలో భక్తులు కనిపిస్తారు. ఏటా చైత్రమాసం చివరిరోజు ఈ జాతర నిర్వహిస్తారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తొలి సారెను సమర్పించారు. భూమన కుటుంబ సభ్యులకు ముస్లిం సోదరులు స్వాగతం పలికారు. గతరెండేళ్లుగా జాతర ఏకాంతంగానే నిర్వహించారు.
కరోనా వల్ల జాతర సందడి లేకుండా పోయిందని.. ఈ ఏడాది అంతా బాగుందని, అమ్మవారి జాతరలో పాల్గొనడం చాలా సంతోషంగా వుందంటున్నారు తిరుపతి వాసులు. జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొమ్మిది వందల సంవత్సరాలుగా గంగమ్మ జాతర జరుగుతోందని తిరుపతి వాసులు చెబుతున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామి కి చెల్లెలుగా అమ్మవారికి స్వామి సారె అందుతుంది. జాతర ప్రారంభం నాడే వర్షం పడింది. ఇది ప్రజలందరికీ చాలా మంచి జరుగుతుందనడానికి సంకేతం అంటున్నారు.
జాతర సదర్భంగా టీటీడీ అధికారులు సారెను అందిస్తారు. జాతర నాలుగోరోజున టీటీడీ అర్చకులు, ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పుట్టింటి సారె అందజేస్తారు. పూర్వం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవడానికి ముందుగా గంగమ్మ తల్లిని దర్శించుకునేవారు. అలా చేస్తే తిరుపతి యాత్ర సంపూర్ణం అవుతుందని, చెల్లెలిని కొలిచే వచ్చేవారిని శ్రీవారు కరుణిస్తారని నమ్మకం. తాతయ్య గుంట గంగమ్మకు సారె ను సమర్పించనున్నారు మంత్రులు రోజా, నారాయణ స్వామి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!