TTD: భక్తులకు మరో షాక్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. వసతి గదుల అద్దెను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. సామాన్య, మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెలను రూ. 500, రూ. 600 నుంచి ఏకంగా వెయ్యి రూపాయలకు పెంచింది.. ఇక, నారాయణగిరి రెస్ట్ హౌస్లోని 1, 2, 3 గదులను రూ. 150 నుంచి జీఎస్టీతో కలిపి రూ 1,700 పెంచారు. రెస్ట్హౌస్…
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాలని చూస్తున్న భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం.. ఎందుకంటే.. వరుసగా వివిధ దర్శనలు, సేవల టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇవాళ ఉదయం 9 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.. జనవరి 12వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సంబంధించిన ఈ టికెట్లను ఆన్లైన్లో పెట్టనున్నారు అధికారులు.. ఇక, ఈ నెల 11వ తేదీ వరకు శ్రీవారి…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఏకాదశి సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై కనకవర్గం, కాసుల వర్షం కురుస్తూనే ఉంది.. శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్ను దాటింది.. శ్రీనివాసుడి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలను దాటడం ఇది వరుసగా 10వ నెల కావడం విశేషం.. డిసెంబర్ నెలలో హుండీ ద్వారా ఇప్పటికే శ్రీవారికి 120.3 కోట్ల రూపాయలను కానుకగా సమర్పించారు భక్తులు.. ఈ నెలలో ఐదు సార్లు ఏకంగా 5 కోట్ల మార్క్ ని దాటేసింది శ్రీవారి హుండి ఆదాయం……
Andhra Pradesh: త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలి నియామకం కానుంది. సంక్రాంతి తర్వాత టీటీడీలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ ఉత్తరాంధ్ర పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. 2019 జూన్ 22న తొలిసారిగా వైవీ సుబ్బారెడ్డి…
తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు కీలక సూచనలు చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.. తిరుమలలో సర్వదర్శనం క్యూ లైనలను పరిశీలంచిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.. ఇక, సర్వదర్శనం భక్తులకు జనవరి 1వ తేదీన తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ద్వారా టోకేన్లు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు.. సర్వదర్శనం భక్తులు టోకెన్ పొందిన తర్వాతే వైకుంఠ…
కలియు ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. ఇక, వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే.. తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతుంటాయి.. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా.. వైకుంఠ ద్వార దర్శనానికి ప్రత్యేకంగా టికెట్లు తీసుకొచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఇవాళ ఉదయం…
తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూశాడు.. దీంతో, పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.. తన పెళ్లి శుభలేఖలు పంచడానికి చెన్నై వెళ్లిన చంద్రమౌళి.. తన బంధువుల ఇంట్లో గుండెపోటుకు గురైన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత ఆయనను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు.. అయితే, మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన చంద్రమౌళి.. ఇవాళ ఉదయం కన్నుమూశారు.. దీంతో, ధర్మారెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది.. చేతికి ఎదిగిన కొడుకు..…