TTD Hundi: శ్రీవారిపై కాసుల వర్షం.. జనవరిలోనూ ఆ మార్క్ దాటింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Hundi Collection: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.. ఇదే సమయంలో.. శ్రీవారికి కానుకలు కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తారు.. శ్రీవారి హుండీల్లో ప్రతీ రోజూ కోట్లాది రూపాయలు, కిలోల కొద్ది బంగారం సమర్పిస్తూనే ఉంటారు భక్తులు.. అయితే, కరోనా సమయంలో.. శ్రీవారి దర్శనాలను రద్దు చేయడంతో.. ఆదాయం తగ్గిపోయింది.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. గత ఏడాది కూడా వరుసగా ప్రతి నెల రూ.100 కోట్ల మార్క్ దాటుతూ వచ్చింది శ్రీవారి హుండీ ఆదాయం.. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతోంది.. 2023 జనవరి మాసంలో వంద కోట్ల మార్క్ ని దాటేసింది శ్రీవారి హుండీ ఆదాయం.. జనవరి మాసంలో శ్రీవారి హుండీ ఆదాయం 123 కోట్ల రూపాయలుగా ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇక, జనవరి 2వ తేదీన శ్రీవారికి టీటీడీచరిత్రలో అత్యధిక హుండీ ఆదాయం లభించింది.. 2వ తేదీన ఏకంగా రూ.7.68 కోట్లు శ్రీవారి హుండీలో సమర్పించారు భక్తులు.
Read Also: Gold: పడిపోయిన బంగారం వినియోగం.. కారణం ఇదే..
Also Read
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
- CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
- Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
కాగా, గత ఏడాది అంటే 2022లో శ్రీవారి హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం భారీగా సమకూరింది. 2022లో తిరుమల శ్రీవారికి భక్తులు రూ. 1446 కోట్లు సమర్పించారు.. జనవరి నుంచి డిసెంబర్ వరకు శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా.. 1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారు.. ఇక, అక్టోబర్ లో రూ. 6.30 కోట్ల ఆదాయం సమకూరింది.. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా 11,42,78,291 కోట్ల లడ్డూలను భక్తులు విక్రయించారు. కరోనా సమయంలో శ్రీవారి హుండీ ఆదయం భారీగా తగ్గింది. కరోనా కారణంగా దాదాపు 83 రోజుల పాటు శ్రీవారి దర్శనాలు టీటీడీ అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పరిమిత సంఖ్యలో దర్శనాలు ప్రారంభించారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లలో పరిమిత సంఖ్యలో భక్తులు రావడంతో స్వామి వారి హుండీ ఆదాయం స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. కోవిడ్ తరువాత భారీగా భక్తులలు రావడంతో గతంలో మాదిరే హుండీ ఆదాయంతో పాటుగా, కళ్యాణ మండపాలు, కళ్యాణకట్ట, లడ్డూ విక్రయాలు, టీటీడీ భూములు లీజు వంటి రూపాల్లో ఆదాయం భారీగా పెరిగింది. ఈ ఏడాదిలోనూ అదే దూకుడు చూపిస్తోంది.
తాజావార్తలు
-
PM Modi: బీజేపీ కొత్త టీమ్తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
-
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
-
University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!