TTD Hundi: శ్రీవారిపై కాసుల వర్షం.. జనవరిలోనూ ఆ మార్క్ దాటింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Hundi Collection: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.. ఇదే సమయంలో.. శ్రీవారికి కానుకలు కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తారు.. శ్రీవారి హుండీల్లో ప్రతీ రోజూ కోట్లాది రూపాయలు, కిలోల కొద్ది బంగారం సమర్పిస్తూనే ఉంటారు భక్తులు.. అయితే, కరోనా సమయంలో.. శ్రీవారి దర్శనాలను రద్దు చేయడంతో.. ఆదాయం తగ్గిపోయింది.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. గత ఏడాది కూడా వరుసగా ప్రతి నెల రూ.100 కోట్ల మార్క్ దాటుతూ వచ్చింది శ్రీవారి హుండీ ఆదాయం.. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతోంది.. 2023 జనవరి మాసంలో వంద కోట్ల మార్క్ ని దాటేసింది శ్రీవారి హుండీ ఆదాయం.. జనవరి మాసంలో శ్రీవారి హుండీ ఆదాయం 123 కోట్ల రూపాయలుగా ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇక, జనవరి 2వ తేదీన శ్రీవారికి టీటీడీచరిత్రలో అత్యధిక హుండీ ఆదాయం లభించింది.. 2వ తేదీన ఏకంగా రూ.7.68 కోట్లు శ్రీవారి హుండీలో సమర్పించారు భక్తులు.
Read Also: Gold: పడిపోయిన బంగారం వినియోగం.. కారణం ఇదే..
Also Read
- Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!
- Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
- US Plane Crash: అమెరికా విమాన ప్రమాదం.. తెలుగు యువకుడు మృతి
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
కాగా, గత ఏడాది అంటే 2022లో శ్రీవారి హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం భారీగా సమకూరింది. 2022లో తిరుమల శ్రీవారికి భక్తులు రూ. 1446 కోట్లు సమర్పించారు.. జనవరి నుంచి డిసెంబర్ వరకు శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా.. 1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారు.. ఇక, అక్టోబర్ లో రూ. 6.30 కోట్ల ఆదాయం సమకూరింది.. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా 11,42,78,291 కోట్ల లడ్డూలను భక్తులు విక్రయించారు. కరోనా సమయంలో శ్రీవారి హుండీ ఆదయం భారీగా తగ్గింది. కరోనా కారణంగా దాదాపు 83 రోజుల పాటు శ్రీవారి దర్శనాలు టీటీడీ అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పరిమిత సంఖ్యలో దర్శనాలు ప్రారంభించారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లలో పరిమిత సంఖ్యలో భక్తులు రావడంతో స్వామి వారి హుండీ ఆదాయం స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. కోవిడ్ తరువాత భారీగా భక్తులలు రావడంతో గతంలో మాదిరే హుండీ ఆదాయంతో పాటుగా, కళ్యాణ మండపాలు, కళ్యాణకట్ట, లడ్డూ విక్రయాలు, టీటీడీ భూములు లీజు వంటి రూపాల్లో ఆదాయం భారీగా పెరిగింది. ఈ ఏడాదిలోనూ అదే దూకుడు చూపిస్తోంది.
తాజావార్తలు
-
Fake Currency Scam: రూపాయి ఇస్తే మూడు రూపాయలు.. నకిలీ నోట్ల ఆశతో 14 లక్షలు పోగొట్టుకున్న అన్నదమ్ములు!
-
Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్స్టా స్టోరీ!
-
RBI New Rules: ఇక బ్యాంకుల దౌర్జన్యానికి చెక్.. ఆర్బీఐ న్యూ రూల్స్.. బ్యాంకు కస్టమర్లకు భారీ ఊరట
-
Prabhas Spirit : స్పిరిట్ క్రేజ్.. వారణాసి, డ్రాగన్, రాకాని క్రాస్ చేసిన రెబల్ స్టార్
-
FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!