TTD Hundi: శ్రీవారిపై కాసుల వర్షం.. జనవరిలోనూ ఆ మార్క్ దాటింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Hundi Collection: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.. ఇదే సమయంలో.. శ్రీవారికి కానుకలు కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తారు.. శ్రీవారి హుండీల్లో ప్రతీ రోజూ కోట్లాది రూపాయలు, కిలోల కొద్ది బంగారం సమర్పిస్తూనే ఉంటారు భక్తులు.. అయితే, కరోనా సమయంలో.. శ్రీవారి దర్శనాలను రద్దు చేయడంతో.. ఆదాయం తగ్గిపోయింది.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. గత ఏడాది కూడా వరుసగా ప్రతి నెల రూ.100 కోట్ల మార్క్ దాటుతూ వచ్చింది శ్రీవారి హుండీ ఆదాయం.. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతోంది.. 2023 జనవరి మాసంలో వంద కోట్ల మార్క్ ని దాటేసింది శ్రీవారి హుండీ ఆదాయం.. జనవరి మాసంలో శ్రీవారి హుండీ ఆదాయం 123 కోట్ల రూపాయలుగా ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇక, జనవరి 2వ తేదీన శ్రీవారికి టీటీడీచరిత్రలో అత్యధిక హుండీ ఆదాయం లభించింది.. 2వ తేదీన ఏకంగా రూ.7.68 కోట్లు శ్రీవారి హుండీలో సమర్పించారు భక్తులు.
Read Also: Gold: పడిపోయిన బంగారం వినియోగం.. కారణం ఇదే..
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. భూములిచ్చేవారికి కౌలు రూ.40 వేలు..
- Minister Parthasarathy: జగన్పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
- Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
కాగా, గత ఏడాది అంటే 2022లో శ్రీవారి హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం భారీగా సమకూరింది. 2022లో తిరుమల శ్రీవారికి భక్తులు రూ. 1446 కోట్లు సమర్పించారు.. జనవరి నుంచి డిసెంబర్ వరకు శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా.. 1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారు.. ఇక, అక్టోబర్ లో రూ. 6.30 కోట్ల ఆదాయం సమకూరింది.. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా 11,42,78,291 కోట్ల లడ్డూలను భక్తులు విక్రయించారు. కరోనా సమయంలో శ్రీవారి హుండీ ఆదయం భారీగా తగ్గింది. కరోనా కారణంగా దాదాపు 83 రోజుల పాటు శ్రీవారి దర్శనాలు టీటీడీ అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పరిమిత సంఖ్యలో దర్శనాలు ప్రారంభించారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లలో పరిమిత సంఖ్యలో భక్తులు రావడంతో స్వామి వారి హుండీ ఆదాయం స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. కోవిడ్ తరువాత భారీగా భక్తులలు రావడంతో గతంలో మాదిరే హుండీ ఆదాయంతో పాటుగా, కళ్యాణ మండపాలు, కళ్యాణకట్ట, లడ్డూ విక్రయాలు, టీటీడీ భూములు లీజు వంటి రూపాల్లో ఆదాయం భారీగా పెరిగింది. ఈ ఏడాదిలోనూ అదే దూకుడు చూపిస్తోంది.
తాజావార్తలు
-
Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
-
Shreyas Iyer: మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేదు.. కెప్టెన్గా ఆ రికార్డ్ సాధించిన శ్రేయాస్ అయ్యర్..
-
IND Vs ENG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులోకి యువ ప్లేయర్..
-
Hormuz Tank Attacks: హోర్ముజ్ జలసంధిలో యుద్ధ వాతావరణం.. 24 గంటల్లో 3 ఆయిల్ ట్యాంకర్లపై దాడులు!
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!