తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి రేపు(నవంబర్ 24) ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చెయ్యనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
టీటీడీలో అర్హత వున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని.. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు కాంట్రాక్ట్ మరియు కార్పొరేషన్ పరిధిలో వున్న ఉద్యోగులను అర్హత మేరకు రెగ్యులరైజ్ చేయనున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి.