తిరుపతిలో 20 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన వినాయక సాగర్ను టీటీడీ ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రారంభించారు. స్థానికుల కోరిక మేరకు వినాయక సాగర్ మధ్యలో వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ స్థానికాలయాల్లో వివిధ విశేష ఉత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబరు 7న గోకులాష్టమి సందర్బంగా ఎస్వీ గోశాలలో గోపూజ నిర్వహించనున్నారు. సెప్టెంబరు 9న తిరుపతి శ్రీ కోదండరామాలయంలో శిక్యోత్సవం(ఉట్లోత్సవం) జరగనుంది. సెప్టెంబరు 10న శ్రీ గోవిందరాజస్వామివారి చిన్నవీధి శిక్యోత్సవం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 11న శ్రీ గోవిందరాజస్వామివారి పెద్దవీధి శిక్యోత్సవం, సెప్టెంబరు 18న వినాయక చవితి రోజున శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇక సెప్టెంబరు 24 నుండి 27వ…
సెప్టెంబరు 18వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇప్పటికే ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సామాన్య భక్తులకు పెద్దపీఠ వేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఏపీలో కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు.