నేడు యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. ఉదయం యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్ సీఎం రేవంత్. తర్వాత భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని దర్శించుకోనున్న సీఎం రేవంత్. భద్రాచలం ఆలయ అభివృద్ధి, నీటిపారుదల అధికారులతో సమీక్ష. సాయంత్రం 4గంటలకు మణుగూరులో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ. నేడు 18 రాష్ట్రాల జాతీయ రహదారులు ప్రారంభం. వర్చువల్గా రహదారులను ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ఏపీలో కడప-బెంగళూరు కనెక్టివిటీ హైవే ప్రారంభం. ఏపీలో జాతీయ రహదారుల ప్రారంభోత్సవంలో…
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.
తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించింది. రమణ దీక్షితుల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీటీడీ.. ఆయన్ను పదవి నుంచి తొలగించింది. మరోవైపు.. రమణ దీక్షితులుపై అహోబిలం మఠం, జియ్యంగార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజుల క్రితం రమణదీక్షితులు టీటీడీ అధికారులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయలర్లపై నీచమైన…
తిరుపతి అభివృద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని మూడోసారి నిర్వహించుకుంటున్న తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. నేడు ఆన్లైన్లో మే నెలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇవాళ అంగప్రదక్షిణం టోకెన్లు విడుదల చేయనున్నారు. మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నేడు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అంతేకాదు మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారి కోటా టోకెన్లు విడుదల చేయనున్నారు.
సోషియల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న రమణధీక్షితులు ఆరోపణలపై ప్రధాన అర్చకులు వేణుగోపాల్ ధీక్షితులు, కృష్ణశేషాచల ధీక్షితులు స్పందించారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలధీక్షితులు మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్ర్తబద్దంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామన్నారు. రమణధీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని, రంగనాయకులు మండపంలో రమణధీక్షితులు హయంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారన్నారు. ఆలయంలో తవ్వకాలు అంటు రమణధీక్షితులు తరుచు ఆరోపణలు చేస్తూన్నారని, రమణధీక్షితులును సియం జగన్ నాలుగు సంవత్సరాలు క్రితమే గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించినా విధులుకు హజరుకావడం లేదన్నారు.…
నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల మే నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు.