Tirumala: రేపు తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: రేపు ( సోమవారం) తిరుమలలో శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఘనంగా జరుగనుంది. తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా తుంబురు తీర్థానికి ఇవాళ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మళ్లీ రేపు ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతిస్తారు. అలాగే పాపవినాశనం డ్యామ్ దగ్గర భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందించనున్నారు. ఇక, ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.
Read Also: Gold Price Today : గుడ్ న్యూస్.. స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఎంతంటే?
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
కాగా, తుంబురు తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది. కాబట్టి.. గుండె, శ్వాస కోస సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి పర్మిషన్ లేదని టీటీడీ తెలిపింది. పలువురు భక్తులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అధికారులు తెలిపారు. అలాగే భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గి పెట్టెలు తీసుకురావొద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక, పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుంచి తుంబురు తీర్థం వరకు భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. అలాగే, ఫాల్గుణ మాసంలో ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రేపు తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, ప్రకృతి సౌందర్యాల మధ్య నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తుంటారు. ఈ ముక్కోటిలో టీటీడీ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక, జూన్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ యొక్క ఆన్లైన్ కోటా టికెట్లను ఈ నెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు అలాగే, పరకామణి సేవ తిరుమల కోసం మధ్యాహ్నం 1 గంటకు టికెట్లను టీటీడీ రిలీజ్ చేయనుంది. రేపు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడసేవ కొనసాగనుంది. ప్రతి నెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
Tumburu Theertha Mukkoti on March 25
One of the major torrent festivals, Tumburu Theertha Mukkoti is scheduled on March 25 on the auspicious day of Phalguna Pournami in the advent of Uttara Phalguni star. pic.twitter.com/Eo2SF2KljI
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) March 21, 2024
తాజావార్తలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!