తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో శ్యామలారావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
నవంబర్ కోటాకు సంబంధించిన వివిధ టికెట్లను విడుదల చేస్తూ.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త చెబుతూ వస్తున్న టీటీడీ.. ఈ రోజు ఆన్లైన్లో నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదల చేయబోతోంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. తిరుమల, తిరుపతిలో నవంబరు నెల గదుల కోటాను ఆన్లైన్లో…
Viral Video: ఇటీవల పుణెకు చెందిన భక్తులు తిరుమలలోని వేంకటేశ్వర ఆలయానికి 25 కిలోల బంగారం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. ఇకపోతే భక్తులు తమ భక్తిని ప్రదర్శించడానికి బంగారం ధరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆలయ నిర్వాహకులకు, స్థానిక మీడియాకు కేంద్రంగా మారింది. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి 25 కిలోల బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. ఒక వీడియోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారితో సహా కుటుంబ సభ్యులు ఆలయం వెలుపల…
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. నవంబర్ నెల కోటాకు సంబందించిన ఆర్జిత సేవా టికెట్లను రేపు (ఆగష్టు 19) విడుదల చేయనున్నారు. ఆగష్టు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్ డిప్ కోసం ఆగష్టు 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారిలో ఈ నెల 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల్లోపు సొమ్ము చెల్లించిన…
Tirumala: తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఇవాళ్టి (గురువారం) నుంచి శాస్త్రోక్తంగా స్టార్ట్ అయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారి పవిత్ర మండపంలోని యాగశాలకు తీసుకు వచ్చి హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు కొనసాగించారు.
తిరుమలలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.. ఈ మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. 18వ తేదీన కళ్యాణోత్సవ సేవ కూడా రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.. ఇక, తిరుమలలో పవిత్రోత్సవాలకు బుధవారం రోజు అంకురార్పణ జరిగింది.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు ఊరేగారు.
తిరుమలలో పవిత్రోత్సవాలకు ఈ రోజు అంకురార్పణ జరగనుంది.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఊరేగనున్నారు శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు.. దీంతో.. ఇవాళ శ్రీవారి ఆలయంలో సహస్రదీపాలంకరణ సేవ రద్దు చేసింది తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ).. ఇక, రేపటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
Thirumla Road: మరోసారి తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు మొదలయ్యాయి. రాత్రి వేళలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై టీటీడీ అధికారులు ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు. దీనికి కారణం మళ్లీ చిరుత కనిపించడమే. గత రెండు నెలల నుంచి తిరుమలలో చిరుతలు తిరుగుతూ కలకలం రేపిన సంఘటనలు చాలానే చూసాము. అయితే జంతువులు బ్రీడింగ్ సమయం కావడంతో.. తరచూ నడక మార్గాన్ని., అలాగే మొదటి ఘాట్ రోడ్డు దాటుతూ భక్తుల్లో చిరుతలు భయాన్ని కలిగిస్తున్నాయి. Harish Rao: కేసీఆర్…
శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు శాస్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. ఎల్లుండి సాయంత్రం శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుల వారి ఉరేగింపుతో పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఘట్టం ప్రారంభమవుతుంది.
TTD Anga Pradakshina Tokens: నేడు శ్రీవారి భక్తుల కోసం టీటీడీ అంగప్రదక్షిణ టోకెన్లను జారీ చేనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ ద్వారా వాటిని రిలీజ్ చేయనున్నారు. ఈ కోటా కింద అందుబాటులోకి తీసుకొచ్చే టికెట్ల సంఖ్య.. 250గా ఉంది. ఈ టికెట్లను పొందిన భక్తులు శనివారం అంటే ఆగస్టు 10న తెల్లవారుజామున అంగ ప్రదక్షిణ చేయవచ్చు అని అధికారులు తెలిపారు.