Minister Vangalapudi Anitha: జగన్ అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు.. అన్నీ కుంటిసాకులే..
- వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై హోంమంత్రి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు..
- జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Vangalapudi Anitha: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. తిరుమల పర్యటనపై పులివెందుల ఎమ్మెల్యే తీసుకున్న నిర్ణయాలకు పులకేశి నెంబర్ ఎంతివ్వాలో కూడా అర్ధం కావట్లేదని ఎద్దేవా చేశారు.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అని విమర్శించారు.. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నాడన్న ఆమె.. డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనే అన్నారు.. లడ్డూ టేస్ట్ గురించి మాట్లాడిన జగన్.. ఏ రోజు తిరుమల లడ్డూ రుచి చూశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Harish Rao: పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటి..
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక, డిక్లరేషన్ ఇవ్వమంటే దళితులకు అంశాన్ని ముడిపెట్టి మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జగన్ చేశాడని దుయ్యబట్టారు అనిత.. వైఎస్ జగన్ హయాంలో టీటీడీ బోర్డు మెంబరుగా దళితులకు అవకాశం ఇచ్చారా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ అయిన ప్రస్తుత మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామికి ఆనాడు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించారు.. హిందూ దళితురాలైన నాకు కూడా టీటీడీ బోర్డు అవకాశం వస్తే.. నాడు రాజకీయ రాద్దాంతం చేసి అది పోగొట్టేలా చేసింది జగనే.. అంటూ మండిపడ్డారు.. జగన్ చెప్పే మానవత్వం గురించి అతని తల్లీ, చెల్లిని చూస్తేనే అందరికి అర్ధమవుతుందన్న ఆమె.. దేశాన్ని కించపరుస్తున్న జగన్ ను దేశ బహిష్కరణ ఎందుకు చేయకూడదు..? అని ప్రశ్నించారు.. సెల్ఫ్ గోల్స్ తో తనని దేశ బహిష్కరణ చేయాలనే పరిస్థితిని జగనే తెచ్చుకున్నాడు.. జగన్ కు ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో చుట్టి పక్కన పెట్టేయటం, అక్షింతలు వేస్తే తల దులిపేసుకున్న సందర్భాలు ఎన్నో చూడలేదా? నిన్న జగన్ పర్యటన సందర్భంగా ఒక్కరినైనా బైండోవర్ చేశామా లేక గృనిర్బంధo చేశామా? అని ప్రశ్నించారు.. శాంతి భద్రతల పరిరక్షణకు సాధారణంగా అమల్లోకి తెచ్చే సెక్షన్ 30 యాక్ట్ తెస్తే తనకే అది జారీ చేసినట్లు జగన్ కథలు అల్లాడు. దేవుడైనా తన గుమ్మం ముందుకు రావలనుకునే తత్వం జగన్ ది కాబట్టే ఇంటి వద్ద గుడి సెట్టింగ్ వేసుకున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.
తాజావార్తలు
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!