MLA Pulivarthi Nani: వైఎస్ జగన్ తిరుమల పర్యటన.. ఎమ్మెల్యే పులివర్తి నాని హాట్ కామెంట్స్
- వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై చంద్రగిరి ఎమ్మెల్యే హాట్ కామెంట్లు..
- కల్తీ నెయ్యి పై సీఎం సిట్ విచారణకు ఆదేశించడం శుభపరిణామం..
- జగన్ తిరుమల పర్యటనకు రౌడీలు 10 వేల మందిని పోగుచేస్తున్నారు..
- జగన్ దర్శనానికి వస్తున్నారా..? దేవుడిపై దాడికి వస్తున్నారా..? అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Pulivarthi Nani: తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం కాకరేపుతోంది.. కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీగా మారింది పరిస్థితి.. ఇక, ఈ రోజు, రేపు రెండు రోజుల తిరుమల పర్యటనకు సిద్ధం అయ్యారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. దీంతో.. డిక్లరేషన్ వ్యవహారం చర్చగా మారింది.. మరోవైపు.. పోలీసులు భారీ బందోబస్తు చేపడుతున్నారు.. ఇక, వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై హాట్ కామెంట్లు చేశారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.. గత కొంత కాలంగా జరుగుతున్న తిరుమల వివాదం తెలిసిందే.. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నారు.. కల్తీ నెయ్యి పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ విచారణకు ఆదేశించడం శుభపరిణామంగా పేర్కొన్నారు.
Read Also: Kolkata Tram: ముగిసిన 151 ఏళ్ల ప్రయాణం.. ఆసియాలోని ఏకైక ట్రామ్వే!
Also Read
- CM Chandrababu: కుప్పంలో పారిశ్రామిక విప్లవానికి శ్రీకారం.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు.!
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
- Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
ఇక, మాజీ సీఎం జగన్.. శ్రీవారి దర్శనానికి వస్తున్నారు.. ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదన్నారు ఎమ్మెల్యే నాని.. అయితే శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి నుంచి వైసీపీ నేతలతో పాటు రౌడీలు 10 వేల మందిని పోగుచేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. వైఎస్ జగన్ దర్శనానికి వస్తున్నారా..? దేవుడిపై దాడికి వస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు.. తిరుమల దర్శనానికి వచ్చే వారు కొందరితో వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు.. మరి ఇంత మందిని ఎందుకు పిలుస్తున్నారు..? అని నిలదీశారు.. అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం మంచి పద్దతి కాదని హితవు పలికారు.. దర్శనం పేరుతో తిరుమలకు వస్తున్న గూండాలను ఎదుర్కొనేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!