Perni Nani: తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, తిరుమల లడ్డూపై విష ప్రచారం..
- తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు..
- కానీ.. ఓ పాలకుడు సాక్షాత్తూ తిరుమలపై రాజకీయం చేయడం దారుణం..
- రాజకీయాల కోసం జగన్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ తప్పుడు ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, అన్ని తెలిసి సామాన్యుడు కూడా కాదు ఒక పాలకుడు సాక్షాత్తూ దేశంలోనే విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడుపై తన రాజకీయ దురుద్దేశంతో తన స్వార్థ రాజకీయాల కోసం తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు.. తిరుపతి దేవస్థానం లేదా ఆ ఏడుకొండలు లేదా పరమ పవిత్రమైన వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నీ దేశం మొత్తం తహతహలాడుతుంది. అలాంటి అలాంటి సన్నిధిలో దొరికే పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఈ రోజు అపవిత్రం జరగకపోయినా.. మలినమైపోయింది అంటూ పలుమార్లు మార్చి మార్చి అపవిత్రం జరిగిందని బొంకుతున్న పాలకులను చూస్తే ఈ రోజు జలిపడే కన్నా భయపడాల్సి వస్తుందన్నారు..
Read Also: Tirupati Laddu Controversy: సీబీఐ విచారణ చేయాలి
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
భగవంతుడు పాపుల నోరు శుద్ధి చేసే క్రమంలో చంద్రబాబు నోరు శుద్ధి చేయడం ప్రారంభించాడు.. స్వయంగా ఆలయ సంరక్షణ అధికారులు చెప్పారు.. నెయ్యిని ప్రక్కన పెట్టాం.. టెస్టుల్లో తప్పులు దొరికాయి.. కాబట్టి ప్రక్కన పెట్టాం అని చెప్పారని తెలిపారు పేర్నినాని.. కానీ, పూటకో కారణం చెప్పి యిప్పటికీ ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నెయ్యి వాడారు.. కానీ, ఎక్కడ ఎందులో వాడారో తెలియదని అంటున్నాడన్నారు.. 70 ఏళ్ల వయస్సులో ఈ బతుకు మనకు అవసరమా చంద్రబాబు గారు.. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు.. ఎంత ఆదర్శంగా బతికి చూపించమనేది ముఖ్యం అన్నారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ప్రపంచం అంతా రాజకీయ నాయకుడు అంటే ఇలాగే బతకాలని చూపించిన నాయకుడు ఆయన అన్నారు.. 75 ఏళ్ల వయస్సు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి.. జగన్మోహన్ రెడ్డి దర్శించుకోవడానికి వెళ్తుంటే తిరుపతిలో ఫ్లెక్సీ లు పెట్టిస్తావా? అని మండిపడ్డారు.. తిరపతిలో పుట్టాను అంటున్నావు.. అసలు ఇక్కడ పుట్టావా..? ఏనాడైనా ఫ్లెక్సీల సంస్కృతి ఉందా? అని నిలదీశారు.. కోడి గుడ్లు, రంగు బుడగలు వేయించడానికి మనుషులను ఏర్పాటు చేశారని ఆరోపించారు.. కాషాయం రంగు పూకుముకున్న కొందరు హిందూ మతానికి రాష్ట్రంలో మేమే ప్రతినిధులం అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని..
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!