Perni Nani: తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, తిరుమల లడ్డూపై విష ప్రచారం..
- తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు..
- కానీ.. ఓ పాలకుడు సాక్షాత్తూ తిరుమలపై రాజకీయం చేయడం దారుణం..
- రాజకీయాల కోసం జగన్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ తప్పుడు ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, అన్ని తెలిసి సామాన్యుడు కూడా కాదు ఒక పాలకుడు సాక్షాత్తూ దేశంలోనే విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడుపై తన రాజకీయ దురుద్దేశంతో తన స్వార్థ రాజకీయాల కోసం తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు.. తిరుపతి దేవస్థానం లేదా ఆ ఏడుకొండలు లేదా పరమ పవిత్రమైన వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నీ దేశం మొత్తం తహతహలాడుతుంది. అలాంటి అలాంటి సన్నిధిలో దొరికే పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఈ రోజు అపవిత్రం జరగకపోయినా.. మలినమైపోయింది అంటూ పలుమార్లు మార్చి మార్చి అపవిత్రం జరిగిందని బొంకుతున్న పాలకులను చూస్తే ఈ రోజు జలిపడే కన్నా భయపడాల్సి వస్తుందన్నారు..
Read Also: Tirupati Laddu Controversy: సీబీఐ విచారణ చేయాలి
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
భగవంతుడు పాపుల నోరు శుద్ధి చేసే క్రమంలో చంద్రబాబు నోరు శుద్ధి చేయడం ప్రారంభించాడు.. స్వయంగా ఆలయ సంరక్షణ అధికారులు చెప్పారు.. నెయ్యిని ప్రక్కన పెట్టాం.. టెస్టుల్లో తప్పులు దొరికాయి.. కాబట్టి ప్రక్కన పెట్టాం అని చెప్పారని తెలిపారు పేర్నినాని.. కానీ, పూటకో కారణం చెప్పి యిప్పటికీ ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నెయ్యి వాడారు.. కానీ, ఎక్కడ ఎందులో వాడారో తెలియదని అంటున్నాడన్నారు.. 70 ఏళ్ల వయస్సులో ఈ బతుకు మనకు అవసరమా చంద్రబాబు గారు.. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు.. ఎంత ఆదర్శంగా బతికి చూపించమనేది ముఖ్యం అన్నారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ప్రపంచం అంతా రాజకీయ నాయకుడు అంటే ఇలాగే బతకాలని చూపించిన నాయకుడు ఆయన అన్నారు.. 75 ఏళ్ల వయస్సు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి.. జగన్మోహన్ రెడ్డి దర్శించుకోవడానికి వెళ్తుంటే తిరుపతిలో ఫ్లెక్సీ లు పెట్టిస్తావా? అని మండిపడ్డారు.. తిరపతిలో పుట్టాను అంటున్నావు.. అసలు ఇక్కడ పుట్టావా..? ఏనాడైనా ఫ్లెక్సీల సంస్కృతి ఉందా? అని నిలదీశారు.. కోడి గుడ్లు, రంగు బుడగలు వేయించడానికి మనుషులను ఏర్పాటు చేశారని ఆరోపించారు.. కాషాయం రంగు పూకుముకున్న కొందరు హిందూ మతానికి రాష్ట్రంలో మేమే ప్రతినిధులం అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని..
తాజావార్తలు
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
-
Uttar Pradesh: అసదుద్దీన్ ఓవైసీ లేకుండా అఖిలేష్ సీఎం కావడం కలే!
-
World Cup 2027: తిలక్ వర్మకు గోల్డెన్ ఛాన్స్.. బీసీసీఐ ప్లాన్ చేసిన టాప్ ఆటగాళ్ల జాబితా ఇదే..
-
Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
-
Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!