Perni Nani: తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, తిరుమల లడ్డూపై విష ప్రచారం..
- తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు..
- కానీ.. ఓ పాలకుడు సాక్షాత్తూ తిరుమలపై రాజకీయం చేయడం దారుణం..
- రాజకీయాల కోసం జగన్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ తప్పుడు ప్రచారం..
Perni Nani: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, అన్ని తెలిసి సామాన్యుడు కూడా కాదు ఒక పాలకుడు సాక్షాత్తూ దేశంలోనే విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడుపై తన రాజకీయ దురుద్దేశంతో తన స్వార్థ రాజకీయాల కోసం తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అంతమొందించడానికి లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు.. తిరుపతి దేవస్థానం లేదా ఆ ఏడుకొండలు లేదా పరమ పవిత్రమైన వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నీ దేశం మొత్తం తహతహలాడుతుంది. అలాంటి అలాంటి సన్నిధిలో దొరికే పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఈ రోజు అపవిత్రం జరగకపోయినా.. మలినమైపోయింది అంటూ పలుమార్లు మార్చి మార్చి అపవిత్రం జరిగిందని బొంకుతున్న పాలకులను చూస్తే ఈ రోజు జలిపడే కన్నా భయపడాల్సి వస్తుందన్నారు..
Read Also: Tirupati Laddu Controversy: సీబీఐ విచారణ చేయాలి
Also Read
- Vallabhaneni Vamsi: ఎస్పీకి వల్లభనేని వంశీ ఫిర్యాదు.. నా వీడియోలు సీక్రెట్గా రికార్డ్ చేసి వైరల్ చేస్తున్నారు..!
- Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య..
- Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్స్టా లవ్.. ఎలుకల మందు తాగి..!
- Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!
భగవంతుడు పాపుల నోరు శుద్ధి చేసే క్రమంలో చంద్రబాబు నోరు శుద్ధి చేయడం ప్రారంభించాడు.. స్వయంగా ఆలయ సంరక్షణ అధికారులు చెప్పారు.. నెయ్యిని ప్రక్కన పెట్టాం.. టెస్టుల్లో తప్పులు దొరికాయి.. కాబట్టి ప్రక్కన పెట్టాం అని చెప్పారని తెలిపారు పేర్నినాని.. కానీ, పూటకో కారణం చెప్పి యిప్పటికీ ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నెయ్యి వాడారు.. కానీ, ఎక్కడ ఎందులో వాడారో తెలియదని అంటున్నాడన్నారు.. 70 ఏళ్ల వయస్సులో ఈ బతుకు మనకు అవసరమా చంద్రబాబు గారు.. ఎన్నాళ్ళు బతికామన్నది కాదు.. ఎంత ఆదర్శంగా బతికి చూపించమనేది ముఖ్యం అన్నారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ప్రపంచం అంతా రాజకీయ నాయకుడు అంటే ఇలాగే బతకాలని చూపించిన నాయకుడు ఆయన అన్నారు.. 75 ఏళ్ల వయస్సు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి.. జగన్మోహన్ రెడ్డి దర్శించుకోవడానికి వెళ్తుంటే తిరుపతిలో ఫ్లెక్సీ లు పెట్టిస్తావా? అని మండిపడ్డారు.. తిరపతిలో పుట్టాను అంటున్నావు.. అసలు ఇక్కడ పుట్టావా..? ఏనాడైనా ఫ్లెక్సీల సంస్కృతి ఉందా? అని నిలదీశారు.. కోడి గుడ్లు, రంగు బుడగలు వేయించడానికి మనుషులను ఏర్పాటు చేశారని ఆరోపించారు.. కాషాయం రంగు పూకుముకున్న కొందరు హిందూ మతానికి రాష్ట్రంలో మేమే ప్రతినిధులం అంటూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని..
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?