Modi-Trump: ట్రంప్కు మోడీ ఫోన్ చేయలేదు.. వాణిజ్య ఒప్పందం నిలిచిపోవడంపై అమెరికా కొత్త వాదన
- భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా కొత్త వాదన
- ట్రంప్కు మోడీ ఫోన్ చేయలేదు
- అందుకే ఒప్పందం జరగలేదని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ వాణిజ్యం కారణంగా అమెరికా-భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తొలుత భారత్పై 25 శాతం సుంకం విధించగా.. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం విధించడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి.

Also Read
తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కొత్త వాదన తీసుకొచ్చారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం నిలిచిపోవడానికి విధానపరమైన తేడాలు కారణం కాదని.. ప్రధాని మోడీ ఫోన్ కాల్ చేయకపోవడమే కారణంగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ.. అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ చేయకపోవడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం నిలిచిపోయిందని తెలిపారు. మోడీనే నేరుగా ట్రంప్కు ఫోన్ చేయాలని.. కానీ అలా చేయకపోవడం వల్లే వాణిజ్య ఒప్పందానికి బ్రేక్లు పడినట్లు చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హోవార్డ్ లుట్నిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా..!
వాణిజ్య ఒప్పందం యొక్క రూపురేఖలు సిద్ధంగా ఉన్నాయని.. దానికి ఖరారు చేయడానికి ప్రధాని మోడీ.. అధ్యక్షుడు ట్రంప్కు ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోతుందన్నారు. ట్రంప్కు ఫోన్ కాల్ చేసేందుకు మోడీ ఎందుకో ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఇది కూడా చదవండి: Tulsi Gabbard: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసిని ట్రంప్ పక్కన పెట్టారా? ఆ ఫొటోలు ఏం చెబుతున్నాయి?
వాణిజ్య ఒప్పందంపై ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఆరు రౌండ్ల చర్చలు జరిగాయి. గతేడాది నవంబర్ నాటికే రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం చేసుకుంటాయని అంతా భావించారు. కానీ ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఎలాంటి వాణిజ్య చర్చలు కూడా జరగడం లేదు. ఇంకోవైపు ట్రంప్ మాట్లాడుతూ.. తాను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు అంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇలా జరుగుతుండగా రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారత్పై 500 శాతం సుంకం విధించేందుకు అమెరికా రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్పై ట్రంప్ సంతకం చేశారు.
తాజావార్తలు
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!