Modi-Trump: ట్రంప్కు మోడీ ఫోన్ చేయలేదు.. వాణిజ్య ఒప్పందం నిలిచిపోవడంపై అమెరికా కొత్త వాదన
- భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా కొత్త వాదన
- ట్రంప్కు మోడీ ఫోన్ చేయలేదు
- అందుకే ఒప్పందం జరగలేదని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ వాణిజ్యం కారణంగా అమెరికా-భారత్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి రాగానే ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తొలుత భారత్పై 25 శాతం సుంకం విధించగా.. అనంతరం రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం విధించడంతో సంబంధాలు దెబ్బతిన్నాయి.

Also Read
- Plastic Currency Trend: ప్రపంచ దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ హవా! కాగితం కరెన్సీకి గుడ్ బై చెప్పిన దేశాలు ఇవే
- Trump-Pakistan: ట్రంప్తో పాకిస్థాన్కు కొత్త సంకటం.. సౌదీకి షరీఫ్, మునీర్!
- పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
- Khawaja Asif: ‘‘మా పూర్వీకులు హిందువులే’’.. ఎట్టకేలకు నిజం ఒప్పుకున్న పాకిస్తాన్ రక్షణ మంత్రి..
తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ కొత్త వాదన తీసుకొచ్చారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం నిలిచిపోవడానికి విధానపరమైన తేడాలు కారణం కాదని.. ప్రధాని మోడీ ఫోన్ కాల్ చేయకపోవడమే కారణంగా చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ.. అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్ చేయకపోవడం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం నిలిచిపోయిందని తెలిపారు. మోడీనే నేరుగా ట్రంప్కు ఫోన్ చేయాలని.. కానీ అలా చేయకపోవడం వల్లే వాణిజ్య ఒప్పందానికి బ్రేక్లు పడినట్లు చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హోవార్డ్ లుట్నిక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా..!
వాణిజ్య ఒప్పందం యొక్క రూపురేఖలు సిద్ధంగా ఉన్నాయని.. దానికి ఖరారు చేయడానికి ప్రధాని మోడీ.. అధ్యక్షుడు ట్రంప్కు ఒక్క ఫోన్ కాల్ చేస్తే సరిపోతుందన్నారు. ట్రంప్కు ఫోన్ కాల్ చేసేందుకు మోడీ ఎందుకో ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఇది కూడా చదవండి: Tulsi Gabbard: అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసిని ట్రంప్ పక్కన పెట్టారా? ఆ ఫొటోలు ఏం చెబుతున్నాయి?
వాణిజ్య ఒప్పందంపై ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఆరు రౌండ్ల చర్చలు జరిగాయి. గతేడాది నవంబర్ నాటికే రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం చేసుకుంటాయని అంతా భావించారు. కానీ ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం ఎలాంటి వాణిజ్య చర్చలు కూడా జరగడం లేదు. ఇంకోవైపు ట్రంప్ మాట్లాడుతూ.. తాను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు అంటూ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇలా జరుగుతుండగా రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారత్పై 500 శాతం సుంకం విధించేందుకు అమెరికా రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్పై ట్రంప్ సంతకం చేశారు.
తాజావార్తలు
-
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
-
Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
-
Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!