Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వెనిజులా ఆయిల్ కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇరాన్ నుంచి చమురు కొనగోలుకు బదులుగా భారత్ వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదర్చుకుందని ఆయన శనివారం చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై న్యూఢిల్లీ నుంచి తక్షణ స్పందన రాలేదు.
Canada: కెనడాకు తత్వం బోధపడుతోంది. రెండేళ్ల క్రితం ఖలిస్తానీ టెర్రరిస్ట్ హత్యను భారత్కు ముడిపెడుతూ అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో పిచ్చి కూతలు కూశాడు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మరోవైపు, కెనడాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికా షాక్ల మీద షాక్లు ఇస్తోంది. చైనాతో వ్యాపారం చేస్తే, 100 శాతం సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో, అమెరికాను దాటి తన…
Trump: కెనడా చైనాతో వాణిజ్య ఒప్పందంపై ముందుకు వెళ్తే, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఉద్రిక్తత పెరిగితే, అన్ని కెనడా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం హెచ్చరించారు. ట్రూత్ సోషల్ వేదికగా ఆయన కెనడా ప్రధాని మార్క్ కార్నీని టార్గెట్ చేస్తూ.
Russia: భారత్, చైనాలను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా సుంకాలను విధిస్తోంది. అయితే, వీటిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. ట్రంప్ విధానాలను ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి విజయవంతం కాదని చెప్పారు. పురాతన నాగరికతలు కలిగిన ఈ రెండు దేశాలు యూఎస్ అల్టిమేటంకు లొంగవని అన్నారు.
Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ శుక్రవారం భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై స్పందించారు. పరోక్షంగా స్పందిస్తూ.. భారత వృద్ధికి భయపడే వారు అలాంటి చర్యలు తీసుకుంటారని అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిరాశ నుంచి ఈ చర్యలు వచ్చాయని అన్నారు.
యూరప్, పశ్చిమ దేశాలు భారత్ తో గౌరవప్రదమైన, సహకార విధానాన్ని అవలంబించాలని, లేకుంటే మనమందరం ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ స్పష్టం చేశారు. భారతదేశంపై విధించిన సుంకాలపై కూడా ఆయన పరోక్షంగా ట్రంప్ను విమర్శించారు. లిథువేనియా అధ్యక్షుడు గీతానాస్ నౌసేడాతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో స్టబ్ మాట్లాడుతూ, షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సౌత్ శక్తి గురించి పశ్చిమ దేశాలను హెచ్చరించిందని అన్నారు.…
US Media: ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు. దీంతో, చైనా కూడా మోడీ రాకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తో మోడీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గురు ప్రపంచ నేతల కలయిక ‘‘సరికొత్త ప్రపంచ క్రమాన్ని’’ ఏర్పాటు చేస్తుందని అంతర్జాతీయంగా…
ఆర్థిక స్వార్థం వల్ల ఎదురయ్యే సవాళ్లు ఎదుర్కొంటామని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన సెమికాన్ 2025 సదస్సులో మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ట్రంప్పై పరోక్ష విమర్శలు గుప్పించారు.
Donald Trump: చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం జరిపిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. మరోసారి, ట్రంప్ తన అక్కసును భారత్పై వెళ్లగక్కుతూ, తాను విధించిన 50 శాతం సుంకాలను మరింతగా సమర్థించుకున్నాడు. భారత్-అమెరికా సంబంధాలను ‘‘ఏకపక్ష విపత్తు’’గా అభివర్ణిస్తూ తన కోపాన్ని రెట్టింపు చేశాడు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా…