US Media: అమెరికన్లను వణికిస్తున్న “మోడీ-పుతిన్-జిన్పింగ్” ఫోటో..
- యూఎస్ వణికిస్తున్న మోడీ-పుతిన్-జిన్ పింగ్ ఫోటో..
- అమెరికన్ల వెన్నులో వణుకు పుట్టిస్తుందని వ్యాఖ్యలు..
- ప్రపంచ క్రమాన్ని మార్చేస్తున్నారని యూఎస్ మీడియా కథనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Media: ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు. దీంతో, చైనా కూడా మోడీ రాకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తో మోడీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గురు ప్రపంచ నేతల కలయిక ‘‘సరికొత్త ప్రపంచ క్రమాన్ని’’ ఏర్పాటు చేస్తుందని అంతర్జాతీయంగా చర్చ జరిగింది.
ఇదిలా ఉంటే.. మోడీ, పుతిన్, జిన్ పింగ్ కలిసి ఉల్లాసంగా, నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు, ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అయ్యాయి. అమెరికన్, వెస్ట్రన్ మీడియాలు ఈ సమావేశాలకు ఎనలేని కవరేజ్ అందించాయి. మరోవైపు, ముగ్గురు అధినేతల కలయిక అమెరికాను కలవరపరుస్తోంది. ట్రంప్ భారత్పై విధించిన 50 శాతం సుంకాలతో భారత్-అమెరికా సంబంధాలు కుదుపులకు గురయ్యాయి. ఇంకో వైపు చైనా, భారత్ తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు అంగీకరించాయి.
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
Read Also: Jinping – Putin – Kim Jong: చావును జయిద్దాం.. జిన్పింగ్-పుతిన్-కిమ్ మధ్య ఆసక్తికర ముచ్చట్లు..
ఈ నేపథ్యంలో మోడీ, జిన్ పింగ్, పుతిన్ కలిసి ఉన్న ఫోటో గురించి అమెరికా రాజకీయ నిపుణుడు, వ్యాఖ్యాత వాన్ జోన్స్ మాట్లాడుతూ.. ‘‘ ఇది ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది’’ అని అన్నారు. ‘‘ ఈ రోజు మనం చారిత్రాత్మక అతిపెద్ద విషయాన్ని తిరిగి చూస్తున్నాము. ఇది చరిత్రలో కీలక మలుపు. ఇది న్యూ వరల్డ్ ఆర్డర్ సంకేతం. ఆధిపత్యం ఆసియా దేశాలదే’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది బహుళ ధ్రువ ప్రపంచాన్ని సూచిస్తుందని సీఎన్ఎన్తో జోన్స్ అన్నారు. వీరి ముగ్గురి కలయిక అమెరికాకు ఏ మాత్రం మంచిది కాదని చెప్పారు.
ఇదిలా ఉంటే, అమెరికన్ మీడియా కూడా ఈ ముగ్గురు నేతల కలయికను హైలెట్ చేసింది. అమెరికా వ్యతిరేక అక్షంగా వాషింగ్టన్ పోస్ట్ రాసింది. ‘‘ట్రంప్ సుంకాలతో భారత్ను దూరం చేయడాన్ని కొనసాగించాలని ఎంచుకుంటే, సరిహద్దు సమస్యలు ఉన్నా చైనాతో కలిసి వేరే మిత్రులు ఉన్నారని మోడీ చూపిస్తున్నారు’’ అని న్యూయార్క్ టైమ్స్ రాసింది. ఎస్సీఓ సమావేశం యూఎస్ ప్రపంచ నాయకత్వానికి సవాలుగా మారిందని సీఎన్ఎన్ తెలిపింది.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!