US Media: అమెరికన్లను వణికిస్తున్న “మోడీ-పుతిన్-జిన్పింగ్” ఫోటో..
- యూఎస్ వణికిస్తున్న మోడీ-పుతిన్-జిన్ పింగ్ ఫోటో..
- అమెరికన్ల వెన్నులో వణుకు పుట్టిస్తుందని వ్యాఖ్యలు..
- ప్రపంచ క్రమాన్ని మార్చేస్తున్నారని యూఎస్ మీడియా కథనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Media: ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు. దీంతో, చైనా కూడా మోడీ రాకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తో మోడీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గురు ప్రపంచ నేతల కలయిక ‘‘సరికొత్త ప్రపంచ క్రమాన్ని’’ ఏర్పాటు చేస్తుందని అంతర్జాతీయంగా చర్చ జరిగింది.
ఇదిలా ఉంటే.. మోడీ, పుతిన్, జిన్ పింగ్ కలిసి ఉల్లాసంగా, నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు, ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అయ్యాయి. అమెరికన్, వెస్ట్రన్ మీడియాలు ఈ సమావేశాలకు ఎనలేని కవరేజ్ అందించాయి. మరోవైపు, ముగ్గురు అధినేతల కలయిక అమెరికాను కలవరపరుస్తోంది. ట్రంప్ భారత్పై విధించిన 50 శాతం సుంకాలతో భారత్-అమెరికా సంబంధాలు కుదుపులకు గురయ్యాయి. ఇంకో వైపు చైనా, భారత్ తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు అంగీకరించాయి.
Also Read
- Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. 'లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్' అంటూ ఫైర్!
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
Read Also: Jinping – Putin – Kim Jong: చావును జయిద్దాం.. జిన్పింగ్-పుతిన్-కిమ్ మధ్య ఆసక్తికర ముచ్చట్లు..
ఈ నేపథ్యంలో మోడీ, జిన్ పింగ్, పుతిన్ కలిసి ఉన్న ఫోటో గురించి అమెరికా రాజకీయ నిపుణుడు, వ్యాఖ్యాత వాన్ జోన్స్ మాట్లాడుతూ.. ‘‘ ఇది ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది’’ అని అన్నారు. ‘‘ ఈ రోజు మనం చారిత్రాత్మక అతిపెద్ద విషయాన్ని తిరిగి చూస్తున్నాము. ఇది చరిత్రలో కీలక మలుపు. ఇది న్యూ వరల్డ్ ఆర్డర్ సంకేతం. ఆధిపత్యం ఆసియా దేశాలదే’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది బహుళ ధ్రువ ప్రపంచాన్ని సూచిస్తుందని సీఎన్ఎన్తో జోన్స్ అన్నారు. వీరి ముగ్గురి కలయిక అమెరికాకు ఏ మాత్రం మంచిది కాదని చెప్పారు.
ఇదిలా ఉంటే, అమెరికన్ మీడియా కూడా ఈ ముగ్గురు నేతల కలయికను హైలెట్ చేసింది. అమెరికా వ్యతిరేక అక్షంగా వాషింగ్టన్ పోస్ట్ రాసింది. ‘‘ట్రంప్ సుంకాలతో భారత్ను దూరం చేయడాన్ని కొనసాగించాలని ఎంచుకుంటే, సరిహద్దు సమస్యలు ఉన్నా చైనాతో కలిసి వేరే మిత్రులు ఉన్నారని మోడీ చూపిస్తున్నారు’’ అని న్యూయార్క్ టైమ్స్ రాసింది. ఎస్సీఓ సమావేశం యూఎస్ ప్రపంచ నాయకత్వానికి సవాలుగా మారిందని సీఎన్ఎన్ తెలిపింది.
తాజావార్తలు
-
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
-
Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
-
Shreyas Iyer Captaincy: 7 మ్యాచ్ల్లో 6 ఓటములు.. శ్రేయస్ కెప్టెన్సీకి పీడకల లాంటి ఆరంభం!
-
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
-
Mohanlal: క్రిషాండ్తో మోహన్లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!