US Media: అమెరికన్లను వణికిస్తున్న “మోడీ-పుతిన్-జిన్పింగ్” ఫోటో..
- యూఎస్ వణికిస్తున్న మోడీ-పుతిన్-జిన్ పింగ్ ఫోటో..
- అమెరికన్ల వెన్నులో వణుకు పుట్టిస్తుందని వ్యాఖ్యలు..
- ప్రపంచ క్రమాన్ని మార్చేస్తున్నారని యూఎస్ మీడియా కథనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Media: ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోడీ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఏడేళ్ల తర్వాత ప్రధాని మోడీ చైనాలో పర్యటించారు. దీంతో, చైనా కూడా మోడీ రాకకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తో మోడీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ముగ్గురు ప్రపంచ నేతల కలయిక ‘‘సరికొత్త ప్రపంచ క్రమాన్ని’’ ఏర్పాటు చేస్తుందని అంతర్జాతీయంగా చర్చ జరిగింది.
ఇదిలా ఉంటే.. మోడీ, పుతిన్, జిన్ పింగ్ కలిసి ఉల్లాసంగా, నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియోలు, ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అయ్యాయి. అమెరికన్, వెస్ట్రన్ మీడియాలు ఈ సమావేశాలకు ఎనలేని కవరేజ్ అందించాయి. మరోవైపు, ముగ్గురు అధినేతల కలయిక అమెరికాను కలవరపరుస్తోంది. ట్రంప్ భారత్పై విధించిన 50 శాతం సుంకాలతో భారత్-అమెరికా సంబంధాలు కుదుపులకు గురయ్యాయి. ఇంకో వైపు చైనా, భారత్ తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు అంగీకరించాయి.
Also Read
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
Read Also: Jinping – Putin – Kim Jong: చావును జయిద్దాం.. జిన్పింగ్-పుతిన్-కిమ్ మధ్య ఆసక్తికర ముచ్చట్లు..
ఈ నేపథ్యంలో మోడీ, జిన్ పింగ్, పుతిన్ కలిసి ఉన్న ఫోటో గురించి అమెరికా రాజకీయ నిపుణుడు, వ్యాఖ్యాత వాన్ జోన్స్ మాట్లాడుతూ.. ‘‘ ఇది ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది’’ అని అన్నారు. ‘‘ ఈ రోజు మనం చారిత్రాత్మక అతిపెద్ద విషయాన్ని తిరిగి చూస్తున్నాము. ఇది చరిత్రలో కీలక మలుపు. ఇది న్యూ వరల్డ్ ఆర్డర్ సంకేతం. ఆధిపత్యం ఆసియా దేశాలదే’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇది బహుళ ధ్రువ ప్రపంచాన్ని సూచిస్తుందని సీఎన్ఎన్తో జోన్స్ అన్నారు. వీరి ముగ్గురి కలయిక అమెరికాకు ఏ మాత్రం మంచిది కాదని చెప్పారు.
ఇదిలా ఉంటే, అమెరికన్ మీడియా కూడా ఈ ముగ్గురు నేతల కలయికను హైలెట్ చేసింది. అమెరికా వ్యతిరేక అక్షంగా వాషింగ్టన్ పోస్ట్ రాసింది. ‘‘ట్రంప్ సుంకాలతో భారత్ను దూరం చేయడాన్ని కొనసాగించాలని ఎంచుకుంటే, సరిహద్దు సమస్యలు ఉన్నా చైనాతో కలిసి వేరే మిత్రులు ఉన్నారని మోడీ చూపిస్తున్నారు’’ అని న్యూయార్క్ టైమ్స్ రాసింది. ఎస్సీఓ సమావేశం యూఎస్ ప్రపంచ నాయకత్వానికి సవాలుగా మారిందని సీఎన్ఎన్ తెలిపింది.
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
-
Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
-
Anil RaviPudi : ‘జనవరి 12 విడుదల’లో స్పెషల్ సాంగ్.. మాస్ ఫ్యాన్స్కు పూనకాలే
-
Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!