Donald Trump: భారత్తో సంబంధాలు ‘‘ఏకపక్ష విపత్తు’’.. భారత్పై ట్రంప్ అక్కసు..
- భారత్పై మరోసారి ట్రంప్ అక్కసు..
- భారత్తో సంబంధాలు ‘‘ఏకపక్ష విపత్తు’’..
- సుంకాలను సమర్థించుకున్న ట్రంప్..
- పుతిన్తో భేటీ అనంతరం ట్రంప్ నుంచి కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశం జరిపిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. మరోసారి, ట్రంప్ తన అక్కసును భారత్పై వెళ్లగక్కుతూ, తాను విధించిన 50 శాతం సుంకాలను మరింతగా సమర్థించుకున్నాడు. భారత్-అమెరికా సంబంధాలను ‘‘ఏకపక్ష విపత్తు’’గా అభివర్ణిస్తూ తన కోపాన్ని రెట్టింపు చేశాడు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం, సైనిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్లే సుంకాలు విధించాల్సి వచ్చిందని తన సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు.
Read Also: Donald Trump: ‘‘భారత్ చాలా ఆలస్యం చేసింది’’.. సుంకాలపై ట్రంప్ బిగ్ కామెంట్స్..
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
అయితే, ఇదే కాకుండా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. భారత్ తన సుంకాలను తగ్గించుకోవడానికి ముందుకు వచ్చిందని, కానీ అప్పటికే ఆలస్యమైందంటూ పేర్కొన్నారు. ఇండియా దీనికి కొన్ని ఏళ్ల క్రితమే చేయాల్సిందని అన్నారు. ‘‘వారు (భారత్) మాతో అపారమైన వ్యాపారం చేస్తారు. భారీ మొత్తంలో మాకు వస్తువులు అమ్ముతారు. కానీ మేము వారికి తక్కువగా అమ్ముతాము. ఇప్పటి వరకు, ఇది పూర్తిగా ఏకపక్ష సంబంధం’’ అని ట్రంప్ ఆరోపించారు.
ట్రంప్ సుంకాలకు, బెదిరింపులకు ఇండియా భయపడకపోవడంతో ట్రంప్ పరిపాలన తీవ్రమైన అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోనే భారత్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చైనాతో భారత బంధాలు బలపడేందుకు ట్రంప్ పరోక్షంగా సాయం చేస్తున్నాడు. ట్రంప్ టారిఫ్స్ కారణంగా రెండు దేశాలు మరింత సహకరించుకోవాలని ఎస్సీఓ సమావేశంలో ఇరు దేశాధినేతలు అవగాహనకు వచ్చారు. ఇక, రష్యా అధినేత పుతిన్తో మోడీ చర్చలు అంతర్జాతీయంగా హెడ్లైన్స్గా మారాయి. రష్యా నుంచి చమురు కొంటామని ఇప్పటికే భారత్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!