సూపర్ స్టార్ మహేష్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా రానున్న విషయం తెలిసిందే. ‘అతడు’ ‘ఖలేజా’ వంటి సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ సినిమా మే 31న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. తాజాగా ఈ చిత్రంలో అక్కినేని హీరో సుమంత్ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. త్రివిక్రమ్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి28’ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా కథ దగ్గర నుంచి హీరో పాత్ర, సినిమా టైటిల్, హీరోయిన్ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు రా ఏజెంట్ గా నటించబోతున్నాడని, సినిమాకు మేకర్స్ ‘పార్థు’ అనే…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ప్రకటించిన ‘అయినను పోయిరావలె హస్తినకు’ ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ కొరటాలతో… త్రివిక్రమ్ మహేష్ తో తమ తమ ప్రాజెక్టులను అనౌన్స్ చేసుకున్నారు. అయితే తాజా సమాచారం ఏంటంటే… ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి కారణం స్క్రిప్ట్ అంటున్నారు. ‘అల వైకుంఠపురం’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ ఎన్టీఆర్30 స్క్రిప్ట్ ను చాలా తేలికగా తీసుకున్నాడట. ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ ప్రకటించిన సంవత్సరం తరువాత కూడా…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కునున్న హ్యాట్రిక్ మూవీని ఇటీవలే ప్రకటించారు. ఈ చిత్రంలో మహేష్ ‘రా’ ఏజెంట్ గా నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాకు త్రివిక్రమ్ ఆసక్తికర టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘పార్థు’ అనే టైటిల్ ను ఎస్ఎస్ఎమ్బి 28 టైటిల్గా ఖరారు చేయాలని భావిస్తున్నారట. మహేష్ బాబుకు కూడా ఈ టైటిల్ నచ్చిందట. కానీ ఇంకా టైటిల్ పై తుది…
టాలీవుడ్ లో కథానాయికల కొరత ఉంది. అందుకే చేసిన హీరోయిన్ తో మళ్ళీ చేస్తూ వస్తున్నారు మన స్టార్ హీరోలు. అందుకే మహేశ్ ఈ సారి కొత్తగా ఆలోచిస్తున్నాడట. త్రివిక్రమ్ దర్శకత్వం వహించే సినిమాలో ఇప్పటి వరకూ మహేశ్ తో నటించని హీరోయిన్ ను నటింపచేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నిజానికి ప్రస్తుతం టాలీవుడ్ లో కరిష్మా ఉన్న కథానాయికలంటే పూజా హేగ్డే, రశ్మిక మాత్రమే. కియారా రెండు సినిమాల్లో నటించి బాలీవుడ్ వైపు పరుగులు పెట్టింది. ఇక కృతి శెట్టిపై ఇంకా స్టార్ హీరోల కన్ను…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందాల్సిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘కోబలి’. రాయసీమ నేపథ్యంలో తెరకెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ కు గతంలోనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ తెలియని కారణాలతో ఈ చిత్రం కార్యరూపం దాల్చలేదు. 2013లో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం తరువాత ‘కోబలి’ సెట్స్ మీదకు వెళ్ళాల్సింది. కానీ ‘అజ్ఞాతవాసి’ వచ్చింది. తరువాత త్రివిక్రమ్… ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ప్రకటించిన ‘అయినను పోయిరావలె హస్తినకు’ ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం తెలిసందే. దీంతో ఎన్టీఆర్ కొరటాలతో… త్రివిక్రమ్ మహేశ్ తో తమ తమ ప్రాజెక్టులను సెట్ చేసుకున్నారు. త్రివిక్రమ్-మహేశ్ సినిమా మే 31న హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆరంభం కానుంది. 2022 సమ్మర్ లో విడుదల కానుంది. ఇక మహేశ్ సినిమా తర్వాత త్రివిక్రమ్ జూనియర్ తో సినిమా చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం…
ప్రిన్స్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మూడో చిత్రానికి లైన్ క్లియర్ అయ్యింది. అన్ని అనుకున్నట్టు జరిగితే… అతి తర్వలో ఈ మూవీ అధికారిక ప్రకటన వస్తుందట. ‘అతడు, ఖలేజా’ సినిమాల చేదు అనుభవాన్ని మరిపిస్తూ… వీరి సరికొత్త చిత్రం ఉండాలని అభిమానులంతా ఆశపడుతున్నారు. ‘అల వైకుంఠపురములో’ సినిమా తర్వాత ఎన్టీయార్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడంటూ ఆ మధ్య అధికారిక ప్రకటన వచ్చింది. ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత పట్టాలెక్కే ఎన్టీయార్ సినిమా ఇదే…