ప్రస్తుతం టాలీవుడ్ లో శిల్పా చౌదరి చీటింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. అధిక వడ్డీ పేరు చెప్పి ప్రముఖుల వద్ద నుంచి కోట్లు కాజేసిన శిల్పా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఇటీవల ఆమె టాలీవుడ్ లోని ముగ్గురు సెలబ్రెటీలను మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అరెస్ట్ అయ్యాకా ఆ ముగ్గురు సెలబ్రెటీలు ఎవరు అనేది అందరిని తొలుస్తున్న ప్రశ్న. ఇక ఈ నేపథ్యంలోనే శిల్ప బాధితుల్లో చాలామంది…
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతోనే ఏపీ అతలాకుతలమైంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో తుఫాన్ ఏపీపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన ఫలితాల ప్రకారం.. గత నెల 29న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఇప్పుడు వాయుగుండంగా బలపడి ఎల్లుండి తుఫాన్ గా మారే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఏపీ, ఒడిశాలో 4న ఉదయం తీరం దాటుతుందని అంచనా వేస్తున్నట్లు వాతావరణ…
వరద ప్రభావిత ప్రాంతాలైన వైయస్సార్ కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్న సీఎం జగన్ రేపు, ఎల్లుండి పర్యటించనున్నారు. తొలిరోజు వైయస్సార్ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో సీఎం ఇంటరాక్ట్ కానున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును సీఎం పరిశీలించనున్నారు. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా ప్రజలతో సీఎం ముచ్చటిస్తారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన…
నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ ఘటనపై నందమూరి కుటుంబ సభ్యులు సైతం భువనేశ్వరికి అండగా నిలబడ్డారు. అయితే తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నారా లోకేష్, ఆయన బృందం నాతో నా కుటుంబంపై చేసిన కామెంట్లకు ఎమోషన్లగా ఒక మాట అనబోయి మరో మాట అన్నానన్నారు. అయితే ఈ విషయంలో తాను…
కరోనా మహహ్మరి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. కరోనా ధాటికి ఎన్నో దేశాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని దేశాలు ఇప్పటికీ కరోనా ప్రభావం నుంచి కోలుకోవడం లేదు. కరోనా కట్టడికి తీసుకువచ్చిన కోవిడ్ టీకాల పంపిణీ కూడా ఎంతో వేగవంతంగా సాగుతోంది. అయినా కూడా కరోనా మహహ్మరి రూపాలు మార్చుకోని ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్లతో తలమునకలవుతోన్న వేళ మరో కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను సైతం మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. దక్షిణాఫ్రికాలో వెలుగు…
రేపటి నుండి ఈ నెల 8 వరకు మావోయిస్టుల వారోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెంలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. డీజీపీ మహేందర్ రెడ్డి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఒకటైన చర్ల మండలం చెన్నాపురంలో పర్యటించిన అనంతరం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ లో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపెందుకు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మావోయిస్టుల వారోత్సవాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత పెంచాలని, సరిహద్దు…
తెలంగాణలో నేటి నుంచి నూతన మద్యం పాలసీ అమలులో ఉండనుంది. రెండు సంవత్సరాల పాటు ఈ పాలసీ అమలులో ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. 2019-2021 మద్యం షాపుల లైసెన్స్ ముగియడంతో కొత్త మద్యం దుకాణాలకు తెలంగాణ సర్కార్ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లకు దరఖాస్తు చేసుకునే వారికి రూ.2లక్షల రుసుము విధించింది. ఈ నేపథ్యంలో 2,620 మద్యం దుకాణాలకు గాను 48 మినహా మిగతా దుకాణాలకు లైసెన్స్ లు మంజూరు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు…
‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’ మృతితో చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆయనతో అనుభందం ఉన్నవారందరూ ఆయనను చివరిచూపు చూసి ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇక తాజాగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ట్విట్టర్ ద్వారా తనదైన రీతిలో స్పందించాడు. ఆడియో ద్వారా ఆయన మాట్లాడుతూ..” సిరివెన్నెల ను నేను అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదటిసారి కలిశాను. శివ సినిమా కు ఒక మంచి కాలేజ్…
టాలీవుడ్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతిపై మిస్టరీ వీడింది. అయితే ఏకే రావు మృతికి వారం రోజుల ముందునుంచే హరిణి కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. ఓ మృతదేహం బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై కనిపించడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృదేహం ఏకే రావుగా గుర్తించిన పోలీసులు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే వారం రోజులుగా కనిపించకుండా పోయిన హరిణి కుటుంబ సభ్యులు రైల్వే…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో ఇంకా స్పష్టత రాలేదు. ఓ వైపు అధికారి టీఆర్ఎస్ పార్టీ అధినేత ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర స్పష్టత ఇవ్వలేదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మరో వైపు తెలంగాణ బీజేపీ నేతలు వానాకాలంలో పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులును మోసం చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే కర్షకుల కోసం కాంగ్రెస్ అంటూ రైతులకు న్యాయం చేయాలని…