నేటి సమాజంలో ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. అలాగే మోసాలు కూడా పెరిగిపోయాయి. చిన్న, మధ్యతరగతి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ ఉండే ఆశ సొంతిల్లు. అయితే ఎంతో కష్టపడి డబ్బుదాచుకొని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని మరీ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసిన ఇల్లుకు సంబంధించిన డాక్యుమెంట్లు నకిలీవి అని తెలిస్తే వారి పరిస్థితి వర్ణనాతీతం. ఇలాంటి సంఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. మల్లంపేట్ సర్వే నంబర్ 170/3, 170/4,…
హైదరాబాద్లో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు చాంద్రాయణగుట్ట పోలీసులు. నిందితులను అరెస్టుచేసి విచారణ చేస్తుండగా వెల్లడించిన విషయాలతో పోలీసులు అవాకయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. హరియానాకు చెందిన ఓ గ్యాంగ్ ఎస్బీఐ ఏటీఏంలనే టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. 27 మంది బంధువులకు సంబంధించి ఫేక్ అకౌంట్స్ సృష్టించిన ఈ గ్యాంగ్.. ఏటీఎంలో డబ్బులు డ్రాచేస్తున్నప్పుడు డబ్బులు వచ్చే సమయానికి పెన్, స్టిక్ అడ్డుపెట్టి సాంకేతిక సమస్యలు సృష్టించేవారు.…
జమ్మూకాశ్మీర్ మంచు సోయగాలను చూసేందుకు అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. అయితే శనివారం జమ్మూకాశ్మీర్ టూరిజం రోడ్షో నిర్వహించింది. ఈ సందర్భంగా పట్నిటాప్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ సీఈఓ షేర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జూన్ నుండి ఇప్పటివరకు 5.5 లక్షల మంది దేశీయ పర్యాటకులు జమ్మూకాశ్మీర్ను సందర్శించారని, వీరిలో 10 శాతం మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినట్లు ఆయన వెల్లడించారు. జమ్మూకాశ్మీర్కు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం…
తెలంగాణలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి కోలుకుంటున్న తెలంగాణ రాష్ట్ర మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకుంటోంది. అయితే తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లో గల పీరంచెరువు సమీపంలో ఉన్న ఒకే అపార్ట్మెంట్లో 10మంది కరోనా పాజిటివ్గా నిర్థారణైంది. దీంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. అయితే ఈ అపార్ట్మెంట్కు చెందిన ఒక వ్యక్తి ఇటీవల దేశరాజధాని ఢిల్లీకి వెళ్లొచ్చాడు. అయితే అతని ద్వారా మిగితా వారికి కరోనా సోకినట్లు అధికారులు…
దక్షిణాఫ్రికాలో గత 15 రోజుల క్రితం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి భారత్తో పాటు పలు దేశాలు కోలుకుంటున్న తరుణంలో ఒమిక్రాన్ బయటపడడంతో మరోసారి యావత్త ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. డెల్టావేరియంట్ కంటే 6రెట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే పలు దేశాల్లో రోజు పదుల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే భారత్లో కూడా ఒమిక్రాన్ తన ఉనికిని చూపెడుతోంది.…
యూకేకు చెందిన కర్రీస్ పీసీ వరల్డ్ అనే సంస్థ ఎలక్ట్రానిక్ రీసైక్లింగ్ గురించి అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టింది. స్థానిక కౌన్సిల్లు, సేవలు, రిటైలర్లు ఉచిత సేకరణ మరియు డ్రాప్-ఆఫ్ సేవలను అందిస్తున్నప్పటికీ, దాదాపు 68% మంది బ్రిటీష్ ప్రజలు తమ ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎక్కడ మరియు ఎలా పారవేయాలనే దానిపై అయోమయంలో ఉన్నారని కంపెనీ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో కర్రీస్ ప్రెస్టన్ స్టోర్ మేనేజర్ డారెన్ కెన్వర్తీ ప్రజలకు…
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అటవీ గ్రామాలలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. కొయ్యూరు అటవీ ప్రాంతం నుండి మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ పరిధిలో గల అటవీ ప్రాంతానికి పులి వచ్చినట్లు వారు తెలిపారు.అడవి సోమనపల్లి, వెంకటపూర్, అరేంద, ఖానాపూర్, కాన్సాయి పేట గ్రామస్తులు, ఎడ్ల, గొర్ల, బర్ల కాపరులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ గ్రామ…
హాలీవుడ్ సినిమాల బడ్జెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకే ఆ సినిమాల్లో వాడే గ్రాఫిక్స్ అంతా న్యాచురల్గా కనిపిస్తుంటాయి కూడా. అయితే తాజాగా హెచ్బీవో ఒరిజినల్స్ కోసం భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్- స్పిన్ఆఫ్’ పైలట్ ఎపిసోడ్ను రద్దు చేసింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ బాహుబలి ది బిగినింగ్ సినిమా కంటే ఈ ఎపిసోడ్ చిత్రీకరణకు హెచ్బీవో ఎక్కువ ఖర్చుచేసింది. బాహుబలి మొదటి పార్ట్కు 28 మిలియన్ల డాలర్లు ఖర్చు కాగా, ‘గేమ్ ఆఫ్…
ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న తరుణంలో మరొ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలను సైతం మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ ఇప్పుడు భారతదేశంలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇటీవల కర్ణాటకలో 2 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసింది. తాజాగా మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా అతడికి కరోనా పాజిటివ్గా…
కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోన్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చి మరోసారి అందరినీ భయాందోళనకు గురి చేస్తోంది. ఈ కొత్త వేరియంట్ తాజాగా భారత్లోకి కూడా ప్రవేశించింది. అయితే నవంబర్ 11న ఓ 66ఏళ్ల వ్యక్తి బెంగుళూరు ఎయిర్పోర్టుకు వచ్చాడు, నవంబర్ 20న 46 ఏళ్ల మరో వ్యక్తి కూడా బెంగుళూరు ఎయిర్పోర్టుకు వచ్చాడు. అయితే అందరికీ చేసినట్లుగానే వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిద్దరికీ ఒమిక్రాన్ వేరియంట్…