సత్యసాయి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ వద్ద.. నాగర్ కోయిల్-ముంబయి రైలు వచ్చే సమయంలో గేట్మెన్ గేటు వేయలేదు. అది గమనించని వాహనాదారులు అలానే రైల్వ్ ట్రాక్ దాటుతున్నారు. ఇంతలోనే ట్రైన్ దగ్గరికొస్తుంది. అది గమనించిన లోకో పైలట్ అప్రమత్తతతో వెంటనే రైలును ఆపేశాడు. దీంతో వాహనాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గేట్మెన్ నిర్లక్ష్యంపై అటు వాహనాదారులు, స్థానికులు తీవ్రంగా ఫైరవుతున్నారు.
ఆపరేషనల్ కారణాల వల్ల విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.
ఒడిశా రైలు ప్రమాదం ఘటనపై ప్రపంచ దేశాలు స్పందిస్తున్నాయి. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, మంత్రులు, దేశ రాయబారులు సందేశాలు పంపుతున్నారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీఎం వైయస్.జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎంఓ కార్యాలయ అధికారులతో కలిసి.. ఈ ప్రమాద ఘటనపై ఆయన సమీక్షించారు. తాజా సమాచారం ప్రకారం 237 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్యకూడా భారీగా ఉందని వివరించారు.
ఒడిశాలో రైలుపట్టాలపై మరణ మృదంగం మోగింది. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 233కి చేరింది. మరో 900 మందికిపైగా గాయపడగా.. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
Kavach Technology : ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2016-17 సంవత్సరం తర్వాత జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదం ఇదే.
Rail Accident: పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ స్టేషన్ నుండి తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం ఒక గూడ్స్ రైలును ఢీకొట్టింది.
Coromandel Express: హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదానికి గురైంది. ఈ రైలు ఒడిశాలోని బాలాసోర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది.
Khammam train: రైల్వే స్టేషన్లలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్స్ ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ప్రయాణికులు అదుపుతప్పి పడిపోవడం జరుగుతూ ఉంటాయి.