Rail Accident: కోరమాండల్ రైలు ప్రమాదంలో 50దాటిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rail Accident: పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ స్టేషన్ నుండి తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం ఒక గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఇందులో 18 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 50మంది మరణించారని, కనీసం 200 మంది గాయపడ్డారని చెబుతున్నారు. మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో ఫోన్లో మాట్లాడారు. పట్నాయక్కు అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Shocked to know that the Shalimar- Coromondel express, carrying passengers from West Bengal, collided with a goods train near Balasore today evening and some of our outbound people have been seriously affected/ injured. We are coordinating with Odisha government and South…
Also Read
— Mamata Banerjee (@MamataOfficial) June 2, 2023
Read Also:Kerala : కేరళలో దారుణం.. యువతికి మత్తు ఇచ్చి, అత్యాచారం..
పశ్చిమ బెంగాల్ నుండి ప్రయాణీకులతో వెళ్తున్న షాలిమార్-కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఈ సాయంత్రం బాలాసోర్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. మా నుండి బయలుదేరిన కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని తెలుసుకోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని బెంగాల్ సిఎం మమతా బెనర్జీ అన్నారు. మా ప్రజల అభివృద్ధి కోసం మేము ఒడిశా ప్రభుత్వం మరియు సౌత్ ఈస్టర్న్ రైల్వేతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ 033- 22143526/22535185 నంబర్లను ఏర్పాటు చేశారు. రెస్క్యూ టీం సహాయం కోసం అన్ని ప్రయత్నాలు ప్రారంభించబడ్డాయి.
Read Also:Ahimsa: ఏందీ బ్రో.. బయట టాక్ చూస్తే అలా.. వీళ్లు చూస్తే ఇలా
Derailment of 12841 Shalimar – Chennai Coromandal Express
================Howrah Help line Number : 033-26382217
Kharagpur Help line Number: 8972073925 & 9332392339
Balasore Help line Number: 8249591559 & 7978418322
Shalimar Help line Number: 9903370746
— South Eastern Railway (@serailwaykol) June 2, 2023
ఒడిశా ప్రభుత్వానికి, రైల్వే అధికారులకు సహకరించేందుకు, సహాయక చర్యల్లో సహకరించేందుకు 5-6 మంది సభ్యుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపుతున్నామని మమతా బెనర్జీ తెలిపారు. ప్రధాన కార్యదర్శి, ఇతర సీనియర్ అధికారులతో కలిసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నానని మమత తెలిపారు. గాయపడిన ప్రయాణీకులను బాలాసోర్ మెడికల్ కాలేజీ, సోరోలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, గోపాల్పూర్, ఖాంటాపాడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చినట్లు చెబుతున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం ప్రమాద స్థలానికి బృందాలను పంపినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్ఆర్సి) కార్యాలయం తెలిపింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర విపత్తు నిర్వహణ మంత్రి ప్రమీలా మల్లిక్, అగ్నిమాపక సేవలతో పాటు SRC సీనియర్ అధికారులను ఆపరేషన్ను పర్యవేక్షించవలసిందిగా ఆదేశించారు.
NDRF బృందం రెస్క్యూ
ఒడిశా ప్రభుత్వం కూడా ఆపరేషన్లో సహాయపడేందుకు ప్రమాద స్థలంలో లైట్ల కోసం జనరేటర్లు ఏర్పాట్లు చేసింది. 22 మంది సభ్యులతో కూడిన మొదటి NDRF బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్లో సహాయం చేయడానికి ఐదు అంబులెన్స్లను పంపినట్లు ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కూడా 15 అంబులెన్స్లను పంపినట్లు తెలిపింది.
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!