మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది… టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలోకి దిగనుండగా.. ఇప్పటికే టీఆర్ఎస్ కూడా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది.. ఇక, కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. ఇప్పటికే మాజీ మంత్రి కొండా సురేఖ పేరును ఖరారు చేశారని.. రేపోమాపో అధికారికంగా ఆమె…
తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడు, కొత్త కమిటీల నియామకం తర్వాత తొలిసారి హస్తినబాట పట్టారు నేతలు.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన టి. కాంగ్రెస్ నేతలు.. రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు హాజరయ్యారు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.. తెలంగాణలో ప్రజా సమస్యలపై ఆందోళనలు, పార్టీ పటిష్టం కోసం కార్యాచరణపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఈ…
తెలంగాణ పొలిటికల్ హీట్ ఇప్పుడు హస్తిన తాకింది.. తన పాదయాత్రకు ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లి వస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలు హస్తినబాట పట్టారు.. కొత్త పీసీసీ చీఫ్ను.. కొత్త కమిటీలను ప్రకటించిన తర్వాత తొలిసారి అందరితో సమావేశం అయ్యేందుకు సిద్ధం అయ్యారు రాహుల్ గాంధీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాహుల్ గాంధీతో టి.కాంగ్రెస్ నేతలు భేటీ…
ఏఐసీసీ తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని, కమిటీలను ప్రకటించిన తర్వాత.. పార్టీలో కొత్త ఊపువచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.. ఇక, టి.పీసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.. ఐదుగురు సీనియర్ అధికార ప్రతినిధులను, 8 మంది అధికార ప్రతినిధులను ఒక సమన్వయ కర్తను నియమించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ మేరకు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే 10 మంది సీనియర్ ఉపాధ్యక్షులకు పార్లమెంట్ నియోజక…
ఈ రచ్చ ఇప్పటిది కాదు… రెండు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. వివాదం కొలిక్కి వస్తుందనుకుంటే… మళ్లీ మొదటికొచ్చింది. టీ కాంగ్రెస్ లో జరుగుతున్న లేటెస్ట్ రచ్చకు కారణమేంటి? తెలంగాణ కాంగ్రెస్ లో… ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి… పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిల మద్య ఒకప్పుడు మంచి మైత్రి ఉండేది. కానీ… రేవంత్ చీఫ్ అయ్యాక సీన్ మారింది. కోమటిరెడ్డి…రేవంత్ మద్య గ్యాప్ పెరిగింది. పిసిసి నియామక సమయంలో టీడీపీ నుండి…
తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ కోమటిరెడ్డి వెంకటె రెడ్డి కలకలం తీవ్రమవుతోంది. పీసీసీ ఆదేశాలను పట్టించుకోకుండా ఆయన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లడం.. ఆ తర్వాత పీసీసీపైనే.. నిద్రపోతోందా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించడం చూస్తుంటే.. ఆయన తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు. కాకుంటే.. తనకు తానుగా కాకుండా.. పార్టీనే స్వయంగా వెళ్లగొట్టేలా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే.. కోమటిరెడ్డి మొదటి నుంచీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పుడు.. ఆ…
పాపం తెలంగాణ కాంగ్రెస్ నేతలు. వాళ్లు ఒకటి తలిస్తే.. అధిష్టానం ఇంకోటి తలిచినట్టుంది. ఈ గ్రూపుల కొట్లాటలో.. తలదూర్చడం ఎందుకనుకున్నారో ఏమో కానీ.. ఇప్పట్లో తెలంగాణలో రాహుల్ గాంధీ సభ ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి.. ఈ నెల 8నే గజ్వేల్ లేదా.. నర్సాపూర్ నియోజకవర్గంలో దళిత గిరిజన దండోరా సభను నిర్వహించాలని ఆ పార్టీ భావించింది. ఆ తర్వాత 17న తెలంగాణ ఉద్యమ కేంద్రం వరంగల్ లో ముగింపు సభను…
దేశంలో ఏ పార్టీకిలేని ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. స్వాతంత్ర్య భారతదేశాన్ని అత్యధిక కాలం పరిపాలించింది కూడా కాంగ్రెస్సే. ఆ పార్టీకి అధికారంలోకి రావడం.. రాకపోవడం కొత్తేమీకాదు. అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటోంది. వరుసగా రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం రాష్ట్రాలపైన పడుతోంది. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ గెలిచిన తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కాంగ్రెస్ రాబోయే ఎన్నికలను ఛాలెంజ్ గా…
కాంగ్రెస్కు హుజురాబాద్లో కొత్త కష్టాలు మొదలయ్యాయి. లోకల్పార్టీ నాయకులు సరికొత్త రాగం అందుకున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖకు టికెట్ ఇస్తున్నారని తెలియడంతో.. లోకల్ మంత్రం జపిస్తున్నారట అక్కడి కాంగ్రెస్ నాయకులు. అదే పీసీసీ పెద్దలను చికాకు పెట్టిస్తోందట. హుజురాబాద్ కాంగ్రెస్ నేతల కొత్త రాగం! హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలకు భిన్నంగా వెళ్లాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అక్కడ ఉన్న ఓటు బ్యాంక్ను కాపాడుకోవడం మొదటి లక్ష్యమైతే.. బలమైన అభ్యర్థిని బరిలో దించితే పరువు కాపాడుకోవచ్చన్నది మరో…
కాంగ్రెస్ రాజకీయమే అంత. ముఖ్యంగా హైకమాండ్ పాలిటిక్స్. దేన్నీ అంత తొందరగా తేల్చదు. అంతా నీదే అంటుంది..కానీ ఆ మాట నేతలందరితో అంటుంది. అదే కాంగ్రెస్ స్పెషాలిటీ. ఎవరి మాట తీసేయదు..అలాగే ఎవరికీ పెద్ద పీఠ వేసి కూర్చోపెట్టదు. కాంగ్రెస్ మార్క్ రాజకీయం అంటేనే అది. ఇప్పుడు హుజూరాబాద్లోనూ అదే జరుగుతోంది. ఈ నెలలోనే ఉప ఎన్నికలు తప్పేలా లేవు. టీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీకి ఈటల రాజేందర్ ఉండనే ఉన్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్.…