Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Reasons Behind Congress Participating Alone In Huzurabad By Election

ఒంటరిగా పోటీ.. కాంగ్రెస్ కు అంత ధైర్యమేంటి?

Published Date :September 4, 2021 , 12:57 pm
By Manohar
ఒంటరిగా పోటీ.. కాంగ్రెస్ కు అంత ధైర్యమేంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలో ఏ పార్టీకిలేని ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. స్వాతంత్ర్య భారతదేశాన్ని అత్యధిక కాలం పరిపాలించింది కూడా కాంగ్రెస్సే. ఆ పార్టీకి అధికారంలోకి రావడం.. రాకపోవడం కొత్తేమీకాదు. అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటోంది. వరుసగా రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం రాష్ట్రాలపైన పడుతోంది. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ గెలిచిన తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కాంగ్రెస్ రాబోయే ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్డీఏ సర్కారు వరుసగా పదేళ్లు అధికారంలో ఉండటంతో ఆపార్టీపై సహజంగానే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీనికితోడు కరోనా ప్రభావం మోడీ సర్కారుపై పడనుంది. పెట్రోల్, డీజీల్, నిత్యావసర, రైతు వ్యతిరేక చట్టాలు బీజేపీకి మైసస్ గా మారనుండగా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ కానున్నాయి. మరోవైపు రోజురోజుకు మోదీ గ్రాఫ్ క్రమంగా పడుతోంది. ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి వరంలా మారనుంది.

అయితే వీటి ప్రభావం తమపై పడకుండా బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ముందుకెళుతోంది. కాంగ్రెస్ ముక్తభారత్ నినాదంతో అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేస్తోంది. బీజేపీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కాంగ్రెస్ ను బలహీన చేయడం ద్వారా తాము అధికారంలోకి వచ్చేలా మోదీ సర్కార్ ప్లాన్ చేస్తోంది.

వరుసగా మూడోసారి కూడా కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైతే ఆపార్టీ మళ్లీ కోలుకోవడం కష్టమనే టాక్ విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అత్యధిక పార్లమెంట్ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపు ఢిల్లీలో అధికారంలోకి రావడానికి ఈజీ మార్గం. అందుకే ఇక్కడ సత్తాచాటడం ద్వారా వచ్చే ఎన్నికలకు సమరశంఖాన్ని పూరించాలని భావిస్తుంది.

ఉత్తరప్రదేశ్లో బీజేపీ సర్కారు బలంగా ఉంది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ.. బహుజన్ సమాజ్ పార్టీలను కాంగ్రెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ పార్టీ వ్యవహారాలను ప్రియాంక గాంధీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ ఏమేరకు సమాయత్తం అవుతుందంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక గతంలో కాంగ్రెస్ పార్టీ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది. అయితే ఆశించిన ఫలితం రాలేదు. దీంతో ఈసారి తాము కాంగ్రెస్ ను కలుపుకుని వెళ్లేది లేదని సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇక యూపీలో దాదాపు రెండు వందలకు పైగానే చిన్నచితక పార్టీలున్నాయి. వీటిని కలుపుకుని పోయేందుకు బీజేపీ, ఎస్సీ, బీఎస్పీలు ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఈ పార్టీల వల్ల ప్రధాన పార్టీల ఓట్లు భారీగా చీలిపోయాయి.

కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లేందుకు సిద్ధమవడం ఆసక్తిని రేపుతోంది. ఈమేరకు ఉత్తరప్రదేశ్లో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని ఆపార్టీ భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా రాహుల్ గాంధీయే అమేధీ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ లో ఏమేరకు సీట్లను సాధిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ చేస్తున్న ఈ సాహసం ఆపార్టీని గట్టెక్కిస్తుందా? లేదంటే నిలువునా ముంచుతుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • huzurabad
  • Huzurabad by-election
  • TPCC

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions