ప్రయాణం చేయాలన్నా లేదా కొత్త ప్రదేశానికి మారాలన్నా, ప్రజల మనసులో ముందుగా వచ్చేది డబ్బు ఖర్చు చేసి బడ్జెట్ను పాడు చేయాలనే ఆలోచన. ప్రత్యేకించి మీరు మీ స్వదేశాన్ని విడిచిపెట్టి, పూర్తిగా కొత్త దేశానికి మారవలసి వస్తే, మీరు చాలా ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సమ్మర్ హాలీడేస్ వచ్చాయంటే.. కొందరు పల్లెటూర్లకు వెళ్తుంటారు.. ఇంకొందరు టూర్లు ప్లాన్ చేసుకొని హాయిగా ప్రయాణాలు చేస్తున్నారు. వీలైతే ఈ సమ్మర్లో ఈ బీచ్లకు వెళ్లండి. విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్, వీసాలు కావాలి. కాబట్టి బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది. భారతదేశంలో ఉన్న బీచ్లు చూస్తే చాలు ప్రపంచంలో ఉన్న వెరైటీ బీచ్లన్నింటినీ చుట్టేసినట్టే.
శ్రీనగర్లోని ప్రఖ్యాత తులిప్ గార్డెన్ పర్యాటకుల సంఖ్యలో కొత్త రికార్డును నెలకొల్పింది. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్ ఖ్యాతి అర్జెంటీనా వంటి సుదూర దేశాలకు చేరుకుంది.
Papikondalu: గోదావరిపై పాపికొండల యాత్ర ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే కొంతకాలంగా గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బోట్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరుత్సాహం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పాపికొండలు వెళ్లేందుకు టూరిజం బోట్లకు అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో భక్తులు ఎక్కువగా గోదావరి నదిపై ప్రయాణించి భద్రాచలం వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఈ మేరకు తమ బోట్లను నడిపేందుకు, పర్యాటకులను పాపికొండలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటక రంగంపై ఫోకస్ పెట్టారు.. అందులో భాగంగా.. పర్యాటక శాఖపై ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరుగనున్న సమావేశానికి.. ఆ శాఖ మంత్రి ఆర్కే రోజా, ఆ శాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.. ఇక, అంతర్జాతీయ ప్రయాణికులకు శుభవార్త కూడా చెప్పబోతున్నారు.. ఎందుకంటే.. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (గన్నవరం) నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీస్లు ప్రారంభంకానున్నాయి.. కరోనా మహమ్మారి…
స్మార్ట్ సిటీ విశాఖలో అదో స్మార్ట్ భవనం. దూరం నుంచి చూస్తే రోటీన్ గానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్తే ఔరా…!!.అనిపిస్తుంది. ఇంతకు ఏమిటా బిల్డింగ్ ప్రత్యే కత. ఇంత స్మార్ట్ ఆలోచన వెనుక ప్రేరణ ఎవరు..!? అలా విశాఖ వరకూ వెళ్ళొద్దాం రండి. విశాఖలో నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో ప్రధానమైనది గురుద్వారా జంక్షన్. ఇక్కడ ఉన్న ఓ హోటల్ నిర్మాణం రోటీన్ కు భిన్నంగా ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నిర్మాణం 100శాతం గ్రీన్ బిల్డింగ్.…