Papikondalu: పర్యాటకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే పాపికొండలు వెళ్లేందుకు బోట్లకు అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Papikondalu: గోదావరిపై పాపికొండల యాత్ర ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే కొంతకాలంగా గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బోట్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరుత్సాహం చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పాపికొండలు వెళ్లేందుకు టూరిజం బోట్లకు అనుమతి ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో భక్తులు ఎక్కువగా గోదావరి నదిపై ప్రయాణించి భద్రాచలం వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. ఈ మేరకు తమ బోట్లను నడిపేందుకు, పర్యాటకులను పాపికొండలు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రైవేట్ టూరిజం బోట్ ఆపరేటర్లు ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ లెవల్కు 30 మీటర్ల మేర నీటిని ఉంచడం ద్వారా రివర్ రూట్ మ్యాప్ను నిర్ణయించవచ్చని సూచించారు.
Read Also: Thief Returned Stolen Things: దేవుడి దెబ్బ.. దొంగ అబ్బ.. చోరీ చేసిన సొత్తు రిటర్న్స్
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
పోలవరం ప్రాజెక్ట వద్ద నీటిమట్టం 28 మీటర్ల స్పిల్ లెవల్లో ఉంటే టూరిజం బోట్లను నడిపేందుకు అధికారులు అనుమతులు ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వరదలు కొనసాగుతున్నాయి. ఫలితంగా నదిలో ఈ స్థాయిలో ప్రయాణించడం వల్ల పర్యాటకుల భద్రతకు ఎటువంటి ప్రమాదం ఉండదని, స్పిల్ లెవల్కు రెండు మీటర్లు పెంచాలని బోట్ నిర్వాహకులు అధికారులను అభ్యర్థించారు. ఈ మేరకు తగినంత లోతు నీరు, సురక్షితమైన మార్గాన్ని మేం తనిఖీ చేస్తున్నామని.. బోట్ ఆపరేటర్లు ఈ మార్గం నుంచి తప్పుకోకుండా చూసుకోవాలని అధికారులు చెప్తున్నారు. త్వరలో బోట్లను నడపడానికి అనుమతిని జారీ చేస్తామని చెప్పారు. కాగా తమ వ్యాపారంతో సంబంధం లేకుండా ఏడాది పొడవునా సిబ్బందికి వేతనాలు చెల్లించాలని.. ప్రస్తుతం బోట్లు నడపకపోవడం వల్ల తమపై ఆర్థిక భారం పడుతోందని బోట్ల యజమానులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బోట్లు నడిపేందుకు అనుమతించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?