Thamma reddy : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పుష్ప 2 బెనిఫిట్ షోలో భాగంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
అమ్మాయిలు ఊరికే ఎదిగేస్తారు అంటుంటారు. వీరిని చూస్తే నిజమేనేమో అనిపించకమానదు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ టెలికాస్ట్ అవుతుండగానే అవికాగోర్ ఉయ్యాల జంపాల అంటూ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది వావ్ అనిపించింది. ఇలాగే ట్విస్ట్ ఇచ్చింది అవంతిక వందనపు. అమ్మ చేసింది మిస్ చాలా లైట్గానే ఉంటుందని తన ముద్దు ముద్దు మాటలతో మెస్మరైజ్ చేసిన అవంతిక ఏకంగా హాలీవుడ్ చిత్రాల్లో హాట్గా కనిపించి ఏంటీ మన అమ్మాయేనా అనేలా బుగ్గలు నొక్కుకునేలా మారిపోయింది. ఇప్పుడు వీళ్ల…
నటనతోనే కాకుండా పలు సేవా కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్న హీరో ఆదిత్య ఓం. తెలంగాణలోని గిరిజన గ్రామమైన చెరుపల్లిలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ఆదిత్య ఓం ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆ ప్రజలందరికీ స్వచ్చమైన నీటిని అందిస్తానని ప్రతిజ్ఞ చేశారు. కలుషితమైన నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆదిత్య ఓం చెరుపల్లి, ఇరుగు పొరుగు గ్రామాల అవసరాలను తీర్చేందుకు RO వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు నేడు భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంతో చర్చ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఇండస్ట్రీలోని సమస్యలతో పాటు పరిశ్రమ ఎదుర్కొంటున్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి సినీ ప్రముఖులు వివరించనున్నారు. అలాగే, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డుల పరిశీలన.. చిన్న, మధ్య స్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు లాంటి విషయాలు…
CM Revanth Reddy : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, సినీ పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ప్రముఖ నిర్మాత, టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఈ రేపు సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సినీ ప్రముఖులతో కలిసి భేటీ కావాలని దిల్ రాజు ప్రకటించారు. అయితే.. తాజాగా రేపు ముఖ్యమంత్రి…
హాట్ టాపిక్ గా మారుతూ అరుదైన లీగల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫ్రీరిలీజ్ ఫంక్షన్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో…
ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ ఇంట విషాదం నెలకొంది. చిన్ని కృష్ణ తల్లి లక్ష్మి సుశీల (75) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున తెనాలిలో మృతి చెందారు. నేటి సాయంత్రం స్వగ్రామం తెనాలిలో సుశీల గారి అంత్యక్రియలు జరగనున్నాయి. టాలీవుడ్ నుంచి పలువులు ప్రముఖులు సుశీల మరణం పట్ల సంతాపం తెలిపారు. Also Read: Axar Patel: తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్..…
Allu Arjun: సంధ్య తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పీఎస్లో హీరో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. విచారణ ముగిసిన అనంతరం ఎవరితో మాట్లాడకుండానే అల్లు అర్జున్ కారులో వెళ్లిపోయారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన…