Dil Raju: టాలీవుడ్లో కాంతార మూవీ సంచలన విజయం నమోదు చేసింది. కన్నడ డబ్బింగ్ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడం చూసి ట్రేడ్ విశ్లేషకులు కూడా నోరెళ్లబెట్టారు. ఈ సినిమాను విడుదల చేసిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీగా లాభాలను చవిచూసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా మరో డబ్బింగ్ సినిమా కూడా కాంతార తరహాలో హిట్ అవుతుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు గట్టి నమ్మకంతో కనిపిస్తున్నాడు. తమిళంలో ఈనెల 4న…
మిస్ ఇండియా మానుషి చిల్లర్ హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోతో ఆమె జోడి కట్టబోతున్నట్లు తెలుస్తోంది. యువ కథానాయకుడు వరుణ్తేజ్తో ఆమె జట్టు కట్టనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.
Tollywood: సూపర్ స్టార్ కృష్ణకు ఘననివాళి ఇవ్వడానికి టాలీవుడ్ సిద్దమయ్యింది. చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నోసేవలు అందించిన కృష్ణ మృతికి టాలీవుడ్ ఘన నివాళి ఇవ్వడానికి సిద్దపడింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి(TFPC), తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్(TFCC) ఆయన మీద గౌరవంతో నవంబర్ 16 న అనగా రేపు షూటింగ్స్ ను నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేసింది.
The Indian Box Office Report-September 2022: మన దేశంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా పలు ఫిల్మ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. వాటి నుంచి ప్రతి వారం, ప్రతి నెలా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో కొన్ని మూవీలు అలా వచ్చి ఇలా పోతున్నాయి. చాలా కొద్ది పిక్చర్లు మాత్రమే హిట్ అవుతున్నా భారీగా కలెక్షన్లు కురిపిస్తున్నాయి. అందుకే.. ఇండియన్ బాక్సాఫీస్ రిపోర్టుకు బిజినెస్పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.
రణ్ బీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' పార్ట్ వన్ ఓ మాదిరి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అందరి కళ్ళు పార్ట్ 2 మీద ఉన్నాయి. పార్ట్ 1 చివర్లో రణబీర్ కపూర్ తండ్రి దేవ్ బ్రహ్మాస్త్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని చూపించారు. దీంతో 'దేవ్' అనే పవర్ ఫుల్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే ఆసక్తి రేగింది.