Tollywood: ముదురుతున్న ‘వారసుడు’ వివాదం.. రిలీజ్ వాయిదా పడుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: టాలీవుడ్లో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమా వివాదం ముదురుతోంది. తెలుగులో వారసుడు, తమిళంలో వారిసుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు గతంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో దిల్ రాజు పెద్ద ఎత్తున థియేటర్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి లాంటి పెద్ద పండగలకు డబ్బింగ్ సినిమాలు విడుదల చేయవద్దని తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖ విడుదల చేసింది.
అయితే తెలుగు సినీ నిర్మాతల మండలి లేఖపై తమిళ సినీ దర్శకులు తీవ్రంగా మండిపడుతున్నారు. తమిళనాడులో తెలుగు సినిమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదలవుతున్నాయని.. మరి తెలుగు రాష్ట్రాలలో తమిళ సినిమాలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. తాము కూడా తమిళనాడులో తెలుగు సినిమాలను అడ్డుకుంటామని తమిళ డైరెక్టర్ సీమాన్ ప్రకటించాడు. వారసుడు సినిమా విషయానికి వస్తే దర్శక, నిర్మాతలు ఇద్దరూ తెలుగువారేనని.. హీరో మాత్రమే తమిళ నటుడు అని సీమాన్ వాపోయాడు. మరి వారసుడు సినిమాకు ఎందుకు ఆటంకాలు సృష్టిస్తున్నారని నిలదీశాడు.
Also Read
- Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
- Joseph Vijay : 'మెగా 158' నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
- Anirudh : అనిరుథ్ - కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
- Sambarala Yeti Gattu: క్లైమాక్స్కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్తో భారీ అప్డేట్!
Read Also: Allari Naresh: ప్రీ రిలీజ్కు సిద్ధం.. ఇట్లు మీ మారేడుపల్లి ప్రజానీకం
ఇంత జరుగుతుంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తోందని దర్శకుడు లింగుస్వామి ప్రశ్నించాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భాషాపరంగా పరిశ్రమల మధ్య విద్వేషాలు వస్తాయన్నాడు. అయితే తాము తమిళ సినిమాలను అడ్డుకుంటామని చెప్పలేదని తెలుగు సినీ నిర్మాతల మండలి అంటోంది. తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇస్తామని మాత్రమే చెప్పామని వివరణ ఇస్తోంది. ఈ అంశంపై టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పందించారు. సినిమాలను ఎవరూ అడ్డుకోలేరని .. ఇది సాధ్యం కాదన్నారు. సినిమా బాగుంటే ఎక్కడైనా ఆడుతుందని.. సినిమాకు ఎల్లలు లేవని.. సౌత్, నార్త్ అనే విభేదాలు తొలగించామని చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమ అందరిదీ అని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. కాగా వారసుడు సినిమాపై వివాదం నెలకొన్న నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ఈ మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పిస్తారా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!