Home
Tollywood News
Tollywood News News
-
ప్రకాశ్ రాజ్ ప్రశ్నకు నరేశ్ కౌంటర్!
‘ఎలక్షన్స్ ఎప్పుడు?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన ప్రకాశ్ రాజ్ కు సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేశ్ అదే సోషల్ మీడియా ముఖంగా బదులిచ్చారు. 2019లో ఎన్నికైన ‘మా’ కార్యవర్గ కాలపరిమితి పూర్తయినా ఇంకా ఎన్నికలు జరపడం లేదు ఎందుకుంటూ ప్రకాశ్ రాజ్ పరోక్షంగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నించారు. దీనికి కొద్దికాలం ముందే ఈసారి ‘మా’ ఎన్నికల్లో తన ప్యానెల్ పోటీ చేస్తుందని ప్రకాశ్ రాజ్ చెప్పారు. Read Also:… -
హీరోగా నటించబోతున్న పవన్ భక్తుడు!
ప్రముఖ నిర్మాత, పవన్ భక్తుడు బండ్లగణేష్ హాస్యనటుడిగా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు పొందాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో చివరిగా నటించిన బండ్ల.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. కాగా, ఇదివరకే ఆయన హీరోగా మారబోతున్నట్లు వార్తలు వచ్చిన బండ్ల ఖండించారు. అయితే తాజాగా బండ్ల.. వెంకట్ అనే కొత్త దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. పూర్తి వినోదభరితంగా సాగే ఈ… -
త్రివిక్రమ్ స్క్రిప్ట్లో నయన్ తళుక్కుమందట!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా గుర్తుండిపోయే చిత్రాలుగా రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. అతిత్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచి కథానాయికపై రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా మరో సీనియర్ కథానాయిక పేరు తెరపైకి వచ్చింది. లేడీ సూపర్ స్టార్… -
తిరుమలలో నిత్యాన్నదానం కోసం నిర్మాత ఆనంద ప్రసాద్ కోటి విరాళం
ప్రముఖ నిర్మాత, భవ్య సంస్థల అధినేత వి. ఆనంద ప్రసాద్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. ఆయన కుటుంబం హైదరాబాద్ లో భవ్య భవన సముదాయ ప్రాంగణంలో వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మించింది. అలానే హైదరాబాద్ నుండి తిరుమలకు ఆనంద్ ప్రసాద్ కాలినడకన వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. 2015లో టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్ హాస్పిటల్ కు వి. ఆనంద ప్రసాద్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. తాజాగా తిరుమల తిరుపతి… -
ఈ నెలలోనే శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’!
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’.. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాల్సివుండగా కరోనా సెకండ్ వేవ్ తో వాయిదా పడింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీ-ఓపెన్ కానున్న నేపథ్యంలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల థియేటర్లు ముస్తాబు అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘లవ్ స్టోరీ’ ఈ నెల 30వ తేదీన ఈ… -
పొలిటికల్ ఎంట్రీపై జగపతిబాబు ఏమన్నాడంటే?
రీల్ లైఫ్లోనే కాదు.. రియల్ లైఫ్లోనూ జగపతి బాబుది డిఫరెంట్ లైఫ్ స్టైల్.. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫోటో వైరల్ గా మారింది. తెలుపు కుర్తా పైజామాలో ఉన్న జగపతిబాబు చేతిలో బ్లాక్ గాగుల్స్ పెట్టుకొని గోడపై కూర్చున్న స్టిల్ను ట్విటర్ పోస్ట్ చేశారు. అయితే చూడ్డానికి ‘డైనమిక్ పొలిటిషియన్ లా కనిపిస్తున్నారు.. మీరు త్వరలో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారా..?’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు. జగ్గూభాయ్ రిప్లై ఇస్తూ..… -
థియేటర్లు తెరిస్తే సమస్య పరిష్కారం అవుతుందా!
గత యేడాది కరోనా తొలిదశలో ప్రభుత్వాలే థియేటర్ల మూసివేతకు ఉత్తర్వులు జారీ చేయగా, ఈ సంవత్సరం సెకండ్ వేవ్ సమయంలో ప్రభుత్వ ఉత్తర్వుల కంటే ముందే థియేటర్ల యాజమాన్యం స్వచ్ఛందంగా తమ సినిమా హాల్స్ ను మూసేశారు. అలానే పలువురు నిర్మాతలూ షూటింగ్స్ ఆపేశారు. ఆ తర్వాతే వీటిని నిషేధిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితుల్లో కొంతమంది నిర్మాతలు ఇప్పుడిప్పుడే ఓటీటీ… -
తమన్ మదిలో మహేష్ కథను నింపేస్తున్న త్రివిక్రమ్!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సంగీతం ఏ లెవెల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలు, పాటల దాకా ప్రత్యేక దృష్టిపెడుతారు. అంతేకాదు, సంగీత దర్శకులతోను మంచి వాతావరణం ఏర్పరచుకొని.. తనకు కావాల్సిన ట్యూన్స్ వచ్చే దాకా కథను పూర్తిగా వారి మదిలో నింపేస్తుంటారు. అందుకే ఆయన సినిమాలో సంగీతం అంత స్పెషల్ గా ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై… -
నటుడిగా, నిర్మాతగా వైవిధ్యానికే కళ్యాణ్ రామ్ ప్రాధాన్యం
(నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా) బాల్యంలో యమ దూకుడుగా ఉన్న ఆ కుర్రాడిని ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇంత సౌమ్యుడై పోయాడేమిటీ? అని ఆశ్చర్యపోతారు! యుక్తవయసులో అమ్మాయిలంటేనే ఆమడ దూరంలో ఉండే ఆ కుర్రాడు… వెండితెరపై ఇంతలా రొమాన్స్ పండిస్తున్నాడేమిటా అని విస్తుపోతారు! తాతగారు, మహానటుడు ఎన్టీఆర్ పేరును తన సొంత బ్యానర్ కు పెట్టుకున్నందుకు, అంతే భక్తి శ్రద్ధలతో సినిమాలు నిర్మిస్తున్న అతన్ని చూసి ఆనంద పడతారు! అతనే నందమూరి కళ్యాణ్ రామ్!!… -
మోదీ సర్కార్ కొత్త చట్టంపై సుధీర్ బాబు ఆగ్రహం…
కొత్త సినిమాటోగ్రఫి బిల్లుపై హీరో సుధీర్ బాబు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ‘సినిమాటోగ్రాఫ్ (అమెడ్మెంట్) బిల్ 2021’ పై తీవ్రంగా స్పందించాడు. ‘ఇప్పటికే సినిమా ఈజీ టార్గెట్ ఉంది. ఈ కొత్త బిల్లు అమల్లోకి వస్తే మరింత ఈజీ టార్గెట్ గా మారిపోతుంది. అయినా రీ సెన్సార్ అనేదే ఉండేటట్లైతే ఇక ‘సీబీఎఫ్సీ’ ఎందుకు?’ అని ఆయన ప్రశ్నించాడు. అంతే కాదు, ఒకింత ఘాటుగా… ‘’నిజంగా రాజకీయ నాయకులు తాము మాట్లాడే…
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!