త్వరలోనే సీఎం జగన్తో సినీ పెద్దలు భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖులు త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవనున్నారు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని బృందం రెడీ అయింది. అయితే ఇదివరకే ఈ భేటీ జరగాల్సిఉండగా.. పలు కారణాలతో వాయిదా పడింది. ఇకపోతే థియేటర్ టికెట్ల ధరలు, బెనిఫిట్ షోలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ రంగం ఇలా సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురానున్నారు సినీ ప్రముఖులు. అలానే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా చిరంజీవి బృందం కొన్ని మార్పులు కోరే అవకాశం కనిపిస్తోంది.
అయితే, తాజాగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా హాళ్ల యాజమాన్యాలతో త్వరలో సమావేశం జరపనున్నామని తెలిపారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ నేతృతంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. త్వరలోనే సినీ పెద్దలు సీఎం జగన్ తో భేటీ కానున్నారని’ మంత్రి పేర్ని నాని తెలిపారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ నెల 20వ తేదీన ఈ భేటీ ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరి చిరు బృందంలో ఎవరెవరు కలిసి ముందుకు వెళ్తారనేది చూడాలి!
Also Read
తాజావార్తలు
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్మార్టానికి హైకోర్టు ఆదేశం
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!