2008లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘బధాయి హో’ టైటిల్ ను బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎంచక్కా వాడేసుకుంటున్నారు. ఆ కథతో సంబంధం లేకుండానే, వేరే వేరే నటీనటులతో ‘బదాయి దో’ అనే సినిమా తీసేశారు. రాజ్ కుమార్ రావ్, భూమి ఫడ్నేకర్ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఇందులో రాజ్ కుమార్ రావ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నాడు. అతనికి భూమి అంటే ప్రేమ. చూస్తుండగానే ఆమెకు 31 సంవత్సరాలు, అతనికి…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రాల విడుదల వాయిదా పడటంతో ప్రభుత్వం కూడా ఈ విషయమై నింపాదిగానే నిర్ణయం తీసుకొనేలా కనిపిస్తోంది. పలువురు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు దర్శక నిర్మాతలు ఆర్. నారాయణమూర్తి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నానిని వ్యక్తిగతంగా కలిసి తమ వాదన వినిపించారు. అలానే ఏపీ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేసింది. ఇక ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన ఈ బ్యూటీ.. ఊ అంటావా ఊఊ అంటావా అంటూ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఇక మరోసారి అమ్మడు ఐటెం సాంగ్ కి సిద్దమైందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న…
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్.. మ్యాంగో వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఆధ్వర్యంలో మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సాంగ్స్ తో అలరించే మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ తాజాగా వివాదంలో చిక్కుకొంది. మ్యాంగో యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ గౌడ కుల సంఘాలు ధ్వజమెత్తాయి. నేడు మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్ పై వారు దాడికి పాల్పడినట్లు…
ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడిగా మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ రెండవ చిత్రమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన విషయం విదితమే. ఆర్ఆర్ఆర్ పోస్టుపోన్ కావడంతో దాన్ని పక్కన పెట్టేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో రెండో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఇది కాకుండా…
బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గురించి పెద్దగా పరిచయం చేయాల్సినవసరం లేదు. అమ్మడి అందచందాలకు అటు బుల్లితెర అభిమానులే కాదు వెండితెర అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం రష్మీ పలు సినిమాల్లో లీడ్ రోల్స్ లో నటిస్తుంది. అయితే గతకొన్నిరోజుల నుంచి రష్మీ గురించిన రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే రష్మీ- సుధీర్ కి మధ్య రిలేషన్ ఉందని, త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. అయితే అందులో…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల భార్య ఐశ్వర్య రజినీకాంత్ కి విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ మధ్య ఉన్న విబేధాల వలెనే తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నామని, దయచేసి తమ ప్రైవసీకి అడ్డుపడకండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సమయంలో అభిమానులందరూ ధనుష్ కి అండగా నిలుస్తున్నారు. ఇక వీటితో పాటు ఇటీవల ధనుష్ కరోనా బారిన పడడం. చికిత్స తీసుకోవడం, ఈ విడాకుల గొడవ వీటన్నింటితో ధనుష్ సతమతమతమవుతున్నాడని తెలుస్తోంది. దీంతో…
తెలుగు చిత్రసీమలో దర్శకత్వంతో పాటు సంగీతం సమకూర్చిన వారూ ఉన్నారు. ఇక నిర్మాణంతో కూడా స్వరాలు పలికించి రంజింప చేసిన వారు అరుదనే చెప్పాలి. వారిలో అగ్రస్థానంలో నిలుస్తారు పెనుపాత్రుని ఆదినారాయణ రావు. ఆదినారాయణరావు నిర్మాతగా మారకపోయి ఉంటే, మరింత మధురాతి మధురమైన సంగీతం మన సొంతమయ్యేదని సంగీతప్రియులు అంటారు. ఆయన బాణీల్లో అంతటి మహత్తుండేది మరి. తన భార్య నటి అంజలీదేవి పేరుమీద ‘అంజలీ పిక్చర్స్’ సంస్థనూ స్థాపించి మరపురాని చిత్రాలను నిర్మించారు ఆదినారాయణరావు. ఆదినారాయణరావు…