కోల్కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ కేసు అధికార పార్టీకి సవాల్ గా మారింది. సొంత పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సమయంలో జాతీయ స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అనేక ఆసక్తికరమైన ఉదంతాలు చోటు చేసుకున్నాయి.
Mamata Banerjee: ఇటీవల బంగ్లాదేశ్ అల్లర్లను ఉద్దేశిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ తన నిరసనను దౌత్యమార్గాల ద్వారా తెలియజేసినట్లు విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం చెప్పింది.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె తన పార్టీకి చెందిన యువ నాయకుడిని కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతోనే వివాదం నెలకొంది. ఈ క్లిప్ను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రజలు దీనిని చాలా ఖండిస్తున్నారు. ఈ వీడియోలో.. వార్డు నంబర్ 18 మహిళా కౌన్సిలర్ సునంద సర్కార్, వార్డు టీఎంసీ యూత్ ప్రెసిడెంట్ కేదార్ దాస్ను…
BJP: పశ్చిమ బెంగాల్లో అరాచక పాలన కొనసాగుతోందని మరోసారి బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఒక వీడియోలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎమ్మెల్యే సన్నిహితుడు తన గ్యాంగ్తో కలిసి ఒక అమ్మాయిని కొడుతున్నట్లుగా చూపిస్తోంది.
Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత, కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ముస్లిమేతరులతో ఇస్లాంను వ్యాప్తి చేయాలంటూ, బహిరంగ మతమార్పిడులను ప్రోత్సహించారు.
పశ్చిమబెంగాల్లో నడిరోడ్డుపై ఓ జంటపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత దాడి చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మమతాబెనర్జీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ పెద్ద ఎత్తున బీజేపీ విమర్శలు గుప్పించింది.
JP Nadda: పశ్చిమ బెంగాల్లో ఓ జంటపై జరిగిన దాడిపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇవాళ స్పందించారు. రాష్ట్రంలో బహిరంగంగా దాడులు జరుగుతుంటే దీదీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్లో ఓ వ్యక్తి నడిరోడ్డుపై అంతా చూస్తుండగా మహిళతో పాటు మరో వ్యక్తిని దారుణంగా కొడుతున్న ఘటన వైరల్గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడుతోంది.
Deputy Speaker: సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన అయోధ్య ఎంపీ అవధేష్ ప్రసాద్ని లోక్సభ డిప్యూటీ స్పీకర్ చేయాలని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆదవారం కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది.