Rachana Banerjee: ‘‘ క్వింటాల్ క్వింటాల్ వాటర్’’.. ఒకప్పటి తెలుగు హీరోయిన్, ఎంపీపై ట్రోలింగ్..
- ఒకప్పటి తెలుగు హీరోయిన్- టీఎంసీ ఎంపీ రచనా బెనర్జీపై తెగ ట్రోలింగ్..
- ‘‘క్వింటాల్ వాటర్’’ అంటూ కామెంట్స్..
- నీటిని క్వింటాళ్లలో కొలవడమేంటని నెటిజన్ల ఎగతాళి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachana Banerjee: ఒకప్పటి తెలుగు హీరోయిన్, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీగా ఉన్న రచన బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోలింగ్కి గురవుతున్నాయి. బెంగాల్లో వరద ప్రాంతాలను సందర్శించి ఎంపీ ‘‘క్వింటాళ్ల నీరు’’ అని కామెంట్స్ చేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, మీమ్స్కి దారి తీసింది. హుగ్లీ ఎంపీగా ఉన్న ఆమె మంగళవారం జిల్లాలోని వరద ప్రాంతాలను సందర్శించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘క్వింటాళ్ల, క్వింటాళ్ల కొద్దీ నీరు వచ్చింది, ప్రజలకు ఇళ్లు లేవు. వారు వీధిన పడ్డారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Minister Payyavula: ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ పనితీరుపై మంత్రి పయ్యావుల సమీక్ష
Also Read
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
- Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్పై తీవ్ర విమర్శలు
- Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
నిజానికి నీటిని లీటర్లలో, పెద్ద మొత్తం నీటిని క్యూసెక్కులతో కొలుస్తారు. టీఎంసీ ఎంపీ క్వింటాల్ని నీటికి కొలమానంగా ఉపయోగించింది. క్వింటాల్ అనేది ఆహారధాన్యాల కొలమానంగా ఉపయోగించబడుతుంది. తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసిన రచన, ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో హుగ్లీ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ లాకెట్ ఛటర్జీని ఓడించి ఎంపీగా గెలిచారు.
అయితే, ఆమె కామెంట్స్పై నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. ఓ యూజర్ తన పోస్టులో ‘‘ నీటిని క్వింటాళ్లలో కొలవవచ్చని ఈ రోజు నేర్చుకున్నా.. నేర్చుకోవడానికి అంతం లేదు’’ అని ఫన్నీగా కామెంట్ చేశారు. మరికొందరు ఆమెను అక్కడి ఓటర్లు ఎలా ఎన్నుకున్నారు..? అని ప్రశ్నించారు. అయితే, మరికొంత మంది యూజర్లు మాత్రం ఆమెకు మద్దతు నిలిచారు. టంగ్ స్లిప్ అయి ఈ వ్యాఖ్యలు చేసి ఉండచ్చని అన్నారు. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ నిర్వహించే డ్యామ్ల నుంచి నీటిని విడుదల చేయడం, భారీ వర్షాల కారణంగా దక్షిణ బెంగాల్లోని అనేక జిల్లాలు వరదలకు గురయ్యాయి. ఈ వరదల వల్ల బెంగాల్లో 28 మంది మరణించారని సీఎం మమతా బెనర్జీ చెప్పారు.
This is TMC MP Rachana Banerjee of Hooghly LS.
She said that, the DVC has released "quintal quintals" of water without informing the WB state government. 😲
2 – 4 kg water release would have been fine but strongly opposed such 'quintal-quintal' water release of DVC.😝
It is a… pic.twitter.com/sSli6cJrgg— Krishanu Singha (@KrishanuOnline) September 25, 2024
తాజావార్తలు
-
Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
-
IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Trisha: విజయ్, అజిత్, సూర్య.. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒకే హీరోయిన్..!
-
Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!