Kolkata Doctor Murder: మహిళా డాక్టర్పై అత్యాచారం ఘటనపై.. కోల్కతా గణేశ్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం
- మహిళా డాక్టర్పై అత్యాచారం.. హత్య
- కొనసాగుతోన్న నిరసనలు
- కోల్కతా గణేశ్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలోని ప్రభుత్వ ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా డాక్టర్పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా.. గణేశోత్సవాన్ని లైట్లు, అలంకరణలకు దూరంగా ఉంచాలని రాజధాని గణేష్ పూజ కమిటీలు నిర్ణయించాయి. ‘అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాటం’ అనే థీమ్తో తమ పూజాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈసారి సాల్ట్లేక్లోని బీ బ్లాక్లో జరిగే 15 ఏళ్ల గణేష్ పూజ కోసం చందర్నగర్ నుంచి కొనుగోలు చేసిన లైట్లను రద్దు చేయాలని నిర్ణయించారు. చందర్నగర్ లైట్లు వాటి ప్రత్యేకమైన డిజైన్కు ప్రసిద్ధి చెందాయి. కానీ ఈసారి వాటిని పూజలో ఉపయోగించరు.
READ MORE: UPS: యుపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే!
Also Read
- IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
- Monday Horoscope: వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఎవరికి..? నేటి ద్వాదశ రాశుల పూర్తి సమాచారం ఇలా.!
- Yashasvi Jaiswal: కొలంబో టెస్టులో హైడ్రామా.. జైస్వాల్–ఫెర్నాండో ఫైట్.. అసలు ఏం జరిగిందంటే?
- AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
పూజా కమిటీ ప్రెసిడెంట్ అనింద్యా ఛటర్జీ మాట్లాడుతూ.. పండల్కు వెళ్లే దారిలో కనీస లైటింగ్ ఉంటుందని, పండల్ లోపల ఎరుపు రంగు లైట్లు ఉంటాయన్నారు. పీఎన్బీ ద్వీపం సమీపంలోని పండల్ పూర్తిగా ‘దర్శన్ రుఖ్ దిన్’ (అత్యాచారానికి వ్యతిరేకంగా) అనే సందేశంతో కటౌట్లతో కప్పబడి ఉంటుందని స్పష్టం చేశారు. చిన్న చిన్న అక్షరాలతో నినాదాలు కూడా రాస్తామని తెలిపారు. మనం ఈ ముప్పును ఇప్పుడే ముగించకపోతే.. మన సహచరులు కూడా దీని బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరారు. బాధిరాలి కుటుంబానికి తాము ఉన్నామంటూ భరోసా కల్పించారు. ఇంతే కాకుండా ఈ ఘటనపై పూజారులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తారని తెలిపారు.
READ MORE: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 వాహనాలు ధ్వంసం, ఐదుగురు మృతి
బాగ్ బజార్ సర్బోజనిన్ గణేష్ పూజ కమిటీ ప్రతినిధి మాట్లాడుతూ.. పండల్లో మరో రెండు లైట్లు ఏర్పాటు చేయాలన్న ఆర్డర్లను రద్దు చేసినట్లు తెలిపారు. 12 ఏళ్లుగా ఈ పూజలు నిర్వహిస్తున్నామని, స్థానిక ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పూజను రద్దు చేయలేమని చెప్పారు. కాగా.. మహిళా వైద్యురాలి హత్యకు నిరసనగా కొందరు పూజలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
READ MORE: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 వాహనాలు ధ్వంసం, ఐదుగురు మృతి
కాగా.. మరోవైపు ఈ ఘటన లో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పాలీగ్రాఫ్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు ఆదివారం నిర్ధారించారు. రాయ్ ప్రస్తుతం కోల్కతా జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఉన్నాడు. అక్కడే లై డిటెక్టర్ పరీక్ష చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు సీబీఐ కార్యాలయంలో పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే, నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ఘోష్, బాధితురాలిపై హత్యాచార ఘటన చోటుచేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులు, మరో సివిల్ వాలంటీర్కు శనివారం లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. ఆ వివరాలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
తాజావార్తలు
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
-
Theaters issue : ఈ వారమే థియేటర్ వార్కు అసలు పరీక్ష.. డిస్ట్రిబ్యూషన్ పవరా? ప్రేక్షకుల డిమాండా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!