Kolkata rape case: తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు!
- దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యురాలిపై అత్యాచారం ఘటన
- ఈ కేసు అధికార పార్టీకి సవాల్ గా మారింది
- సొంత పార్టీలో విభేదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ కేసు అధికార పార్టీకి సవాల్ గా మారింది. సొంత పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. మొదటగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించగా.. ఇప్పుడు కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య సలహాదారు పదవి నుంచి కూడా తొలగించారు. అయితే.. ఈ ఘటనలో టీఎంసీ పార్టీ నేతలే పరస్పరం తప్పు పట్టుకునే పరిస్థితి దాపరించింది. తాజాగా ఆ పార్టీ నేత సుఖేందు శేఖర్ రాయ్ ఈ కేసు విచారణలో సీబీఐ నిక్కచ్చిగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
READ MORE: Kolkata Doctor Case: కోల్కతా డాక్టర్ హత్యాచార నిందితుడికి సీబీఐ “సైకలాజికల్ టెస్ట్లు” ..
Also Read
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
కళాశాల మాజీ ప్రిన్సిపల్, పోలీస్ కమిషనర్ను కస్టోడియల్ విచారించాలని కోరారు. అత్యాచారం ఘటనను ఆత్మహత్యగా ఎందుకు మార్చాలనుకున్నారో తెలియాలన్నారు. అసలు సెమినార్ హాల్ కి సంబంధించిన గోడను ఎందుకు నేలమట్టం చేశారని ప్రశ్నించారు. నిందితుడు అంత శక్తిమవంతంగా మారేందుకు కారణమెవరని మండిపడ్డారు. పోలీసు జాగిలాలను రప్పించేందుకు మూడు రోజుల సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు.
READ MORE:Crime News: దారుణం.. భార్యను హత్య చేసి రైల్వే ట్రాక్పై పడేసిన భర్త
ఈ మేరకు సుఖేందు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో పోస్ట్ చేయగా.. దానిపై సొంత పార్టీకి చెందిన మరో నేత కునాల్ ఘోష్ స్పందించారు. సుఖేందు శేఖర్ రాయ్ పోస్టును రీపోస్టూ చేస్తూ.. ఈ ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీపీ శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. సీపీపై వస్తున్న డిమాండ్లను వ్యతిరేకిస్తున్నానన్నారు. దర్యాప్తు సానుకూల కోణంలో సాగుతోందని పేర్కొన్నారు. తమ పార్టీ సీనియర్ నాయకుడి నుంచి ఇలాంటి పోస్ట్ రావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. జాగిలాల విషయంలో పార్టీ నేత సుఖేందు శేఖర్ రాయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారనే కారణంతో ఆయనకు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసుపై మాట్లాడిన భాజపా నేత లాకెట్ ఛటర్జీ, వైద్యులు కునాల్ సర్కార్, సుబర్నో గోస్వామికి కూడా పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..