Congress: “అహంకారం, అతి విశ్వాసం”.. కాంగ్రెస్ని ఏకిపారేస్తున్న మిత్రపక్షాలు..
- హర్యానాలో కాంగ్రెస్ ఘోర పరాజయం..
- కాంగ్రెస్ని ఏకిపారేస్తున్న మిత్ర పక్షాలు..
- అహంకారం.. అతివిశ్వాసంతోనే కాంగ్రెస్ ఓటమి..
- ఉద్ధవ్ శివసేన..టీఎంసీ..ఎన్సీల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా సరైన ప్రదర్శన చేయలేదు. నేషనల్ కాన్ఫరెన్స్ అండతో కేవలం 6 సీట్లలో మాత్రమే గెలుపొందింది. జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ సత్తా చాటింది. అధికారం దక్కకపోయినప్పటికీ పార్టీ తన ఓట్లను, సీట్లను పెంచుకుంది. జమ్మూ ఏరియాలో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ తర్వాత 29 స్థానాలు గెలిచి రెండో స్థానంలో ఉంది.
ఇదిలా ఉంటే, ఈ ఫలితాలు ఇండియా కూటమిలో లుకలుకలకు కారణమైంది. ముఖ్యంగా కాంగ్రెస్ టార్గెట్గా మిత్రపక్షాలు ఏకిపారేస్తున్నాయి. ఉద్థవ్ ఠాక్రే శివసేన తన సామ్నా పత్రిక ద్వారా కాంగ్రెస్ని విమర్శించింది. ఆప్తో పొత్తు పెట్టుకోవడంతో పాటు స్థానిక నాయకుల్లో అవిధేయతను నియంత్రించడంలో విఫలమైందని చెప్పింది. గెలిచే ఇన్సింగ్స్ని ఓటమిగా మార్చిందని కాంగ్రెస్ని ఎండగట్టింది. అయితే, మిత్ర పక్షం ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యాఖ్యల్ని కాంగ్రెస్ మహరాష్ట్ర చీఫ్ నానా పటోలే ఖండించారు. హర్యానా, మహారాష్ట్ర వేర్వేరు రాజకీయ నేపథ్యాల్ని కలిగి ఉన్నాయని, మహారాష్ట్రలో జ్యోతీరావు ఫూలే, డాక్టర్ అంబేద్కర్ భావజాలం ఉందని అన్నారు.
Also Read
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
Read Also: Haryana Elections: బీజేపీకి పెరిగిన మరింత బలం.. ఇద్దరు ఇండిపెండెంట్లు చేరిక..
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ పొత్తులో ఉన్నాయి. హర్యానాలో కాంగ్రెస్ అతివిశ్వాసం కొంపముంచిందని శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గతేడాది చివర్లో జరిగిన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికలని సామ్నాలో ప్రస్తావించింది శివసేన, అతి విశ్వాసంతోనే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని చెప్పింది. భూపిందర్ హుడా, కుమారి సెల్జాల మధ్య ఆధిపత్య పోరుని కూడా సామ్నాలో పేర్కొంది.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ కూడా కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ది అహంకారపూరిత ధోరణి అని అభివర్ణించింది. సీట్ల పంపకంపై కాంగ్రెస్ వైఖరిని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే విమర్శించారు. ఇదిలా ఉంటే, జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్ కూడా హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై లోతైన సమీక్ష చేసుకోవాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్ కాబోయే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. “హర్యానాలో బిజెపి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ దీనిపై లోతైన చర్చలు జరపాలి, కానీ అది నా పని కాదు” అన్నారు.
తాజావార్తలు
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!