తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు ఆమె ఢిల్లీలో పర్యటించనున్నారు.. ఈ నెల 22న హస్తినకు వెళ్లనున్న ఆమె.. తిరిగి 25న కోల్కతాకు చేరుకోనున్నారు.. ఈ పర్యటనలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం అవుతారని తెలుస్తోంది.. ఇదే సమయంలో.. ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం.. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు,…
ఆదివారం భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పార్లమెంట్లో జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రు లెవరూ హాజరు కాలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. “ఈరోజు పార్లమెంట్లో అసాధారణ దృశ్యం… లోక్సభ స్పీకర్ గైర్హాజరు. చైర్మన్ రాజ్యసభ గైర్హాజరు. ఒక్క మంత్రి కూడా హాజరు కాలేదు” పరిస్థితి అసాధారణంగా ఉందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్వీట్ చేశారు. “ఇది ఇంతకంటే దారుణం కాగలదా?” అని రాజ్యసభ ఎంపీ అన్నారు. అని రమేష్…
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ అంతా బీజేపీ వైపు చూశారు.. ఆ తర్వాత ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.. అదే పశ్చిమబెంగాల్.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వానేనా అంటూ సాగిన సమరంలో.. మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది.. మళ్లీ బెంగాల్ సీఎం పీఠాన్ని అధిరోహించారు మమతా బెనర్జీ.. అయితే, ఎన్నికలకు ముందు టీఎంసీ లీడర్లను ప్రలోభాలకు గురిచేసి.. బీజేపీ కొంతమందిని ఆ పార్టీలో చేర్చుకున్నాయనే విమర్శలు…
మరో నాలుగు నెలల్లో గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు చూస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకొని మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నది. అయితే, దేశంలో పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం ఈ ఎన్నికలపై కనిపించే అవకాశం ఉన్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటుగా ఈసారి గోవా నుంచి తృణమూల్, ఆప్ పార్టీలు కూడా బరిలోకి…
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎంత టార్గెట్ చేసినా.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్షా సహా బీజేపీ కేంద్ర పెద్దలు ప్రత్యేకంగా దృష్టిసారించినా.. మరోసారి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు మమతా బెనర్జీ.. అయితే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు… మమత బెనర్జీ ప్రణాళికలు రచిస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖండ మెజార్టీ విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత కేంద్రంలో కీలక పాత్ర పోషించేందుకు.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో…
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో పట్టు సాధించడానికి అన్ని పార్టీలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి.. ఓవైపు, మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ పావులు కదుపుతుంటూ.. ఇంకా వైపు.. ప్రతీ అంశాన్ని క్యాచ్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది.. ఎస్పీ, బీఎస్పీలు కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.. ఇక, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. ఇతర రాష్ట్రాలకు విస్తరించడంపై ఫోకస్ పెట్టింది.. ఈ తరుణంలో.. కాంగ్రెస్ పార్టీకి గట్టి…
దేశంలో బీజేపీని ఓడించేందుకు కంకణం కట్టుకున్న దీదీ కాళ్లకు చక్రాలు కట్టుకొని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఆ పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారు. బీజేపీ పాలన నుంచి దేశాన్ని కాపాడాలి అనే లక్ష్యంగానే దీదీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బెంగాల్లో ఇచ్చిన విజయాన్ని స్పూర్తిగా తీసుకొని గోవాలో పార్టీ పోటీ చేయడానికి సిద్ధమయింది. త్వరలోనే గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. 40 స్థానాలున్నా గోవా అసెంబ్లీలో ఎలాగైనా పాగా వేయాలని తృణమూల్ కాంగ్రెస్ చూస్తున్నది. ఈనెల…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు తగ్గట్టుగానే ఆయన కాంగ్రెస్ లో చురుకైన పాత్రను పోషిస్తూ వచ్చారు. అయితే, పంజాబ్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన తరువాత కాంగ్రెస్ అధిష్టానంతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. బెంగాల్ ఎన్నికల తరువాత ఎన్నికల వ్యూహకర్తగా విధులు నిర్వహింబోనని చెప్పడంతో ఆయన కాంగ్రెస్ చేరుతారనే వార్తలు వినిపించాయి. అయితే, కాంగ్రెస్లో కొంతమంది పెద్దలు ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహాల వరకే…
ఈ రోజు పశ్చిమ బెంగాల్ లో భబానీపూర్ కు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో అందరూ ఊహించినట్లే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఘన విజయం సాధించారు. అనంతరం ఈ ఫలితాల పైన ఆవిడ స్పందిస్తూ… భబానీపూర్ లో దాదాపు 46 శాతం మంది బెంగాలీయేతరులు ఉన్నారు. వారందరూ నాకు ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు భబానీపూర్ వైపు చూస్తున్నారు. ఇది నాకు స్ఫూర్తినిచ్చింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు…
సెప్టెంబర్ 30 వ తేదీన పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేశారు. బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటిగ్ జరుగుతున్నది. తాజా సమాచారం ప్రకారం తృణమూల్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 12 రౌండ్లు ముగిసే సరికి మమతా బెనర్జీ 35 వేల ఓట్ల మేజారిటీని…